Begin typing your search above and press return to search.

ఆడియో వేడుకకు రూ.2 కోట్లా?

By:  Tupaki Desk   |   17 March 2016 4:31 PM IST
ఆడియో వేడుకకు రూ.2 కోట్లా?
X
ఓ పక్క ఈ నెల 20న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటే.. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకకు ముహూర్తం చూసుకున్నాడు. ఏప్రిల్ 23న తిరుపతి వేదికగా ‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడని పీవీపీ సంస్థ.. ఈ వేడుక కోసం దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ కళాశాల మైదానంలో భారీ సెట్టింగ్ వేసి.. ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలిసింది.

‘బ్రహ్మోత్సవం’ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి తిరుపతిని ఆడియో వేడుకకు వేదికగా ఎంచుకోవడమే కాదు.. వెన్యూని కూడా సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దబోతున్నారట. సూపర్ స్టార్ కృష్ణతో పాటు తెలుగు పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ఈ వేడుకకు అతిథులుగా హాజరవుతారు. కృష్ణకు ఇది రజతోత్సవ సంవత్సరం కావడంతో ఆయన్ని ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ వేడుక ముగిశాక మరుసటి రోజు మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న కృష్ణ సొంతూరు బుర్రిపాలెంను కుటుంబంతో కలిసి సందర్శించబోతున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే మహేష్ భార్య నమ్రత, సోదరి గల్లా పద్మ అక్కడ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.