Begin typing your search above and press return to search.

మహేష్‌ ను మెస్మరైజ్‌ చేసిందట

By:  Tupaki Desk   |   18 Sep 2020 12:10 PM GMT
మహేష్‌ ను మెస్మరైజ్‌ చేసిందట
X
ఈ ఏడాది ఆరంభం నుండి కూడా మహేష్‌ బాబు కెమెరాకు దూరంగా ఉన్నాడు. మొదటి రెండు మూడు నెలలు సరిలేరు నీకెవ్వరు సినిమా హడావుడి కొనసాగగా ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్స్‌ అన్ని కూడా నిలిచి పోయాయి. ఇక మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆయన ఎక్కువగా పిల్లలతో గడపడంతో పాటు ఓటీటీ కంటెంట్‌ ను చూస్తు పుస్తకాలను కూడా చదువుతున్నాడట. కొన్ని రోజుల క్రితం తనకు నచ్చిన ఓటీటీ వెబ్‌ సిరీస్‌ ల గురించి మాట్లాడిన మహేష్‌ బాబు ఇప్పుడు తాను చదివిన ఒక పుస్తకం గురించి ట్వీట్‌ చేశాడు.

థింక్‌ లైక్‌ ఏ మాంక్‌ పుస్తకం గురించి తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. పుస్తకం చదువుతున్నంత సేపు కూడా రచయిత మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా సింపుల్ గా ఉంది. జే శెట్టి ఈ పుస్తకం రాయడానికి ముందు సన్యాసిగా ఉన్నాడు. ఆ సమయంలోని తన అనుభవాలను మరియు తాను పొందిన మానసిక ప్రశాంతతను గురించి వివరించాడు. అతడి క్లుప్తమైన వివరణ ఇప్పటికే జనాలకు నచ్చింది. తాజాగా మహేష్‌ బాబు కూడా బుక్‌ చాలా బాగుంది అంటూ చెప్పడంతో నెటిజన్స్‌ కు మరింతగా ఆ బుక్‌ పై ఆసక్తి కలుగుతోంది. పుస్తకాలు చదివే అలవాటు చాలా మంచింది. మహేష్‌ బాబుకు ఆ అలవాటు ఉంది. ఆయన అభిమానులు ల కూడా ఇప్పుడు ఈ బుక్‌ చదివి ఆ మంచి అలవాటును అలవర్చుకోవాలని ఆశిద్దాం.