Begin typing your search above and press return to search.

మహేష్ అభిమానులపై బాలీవుడ్‌ కన్ను

By:  Tupaki Desk   |   24 April 2016 11:30 AM GMT
మహేష్ అభిమానులపై బాలీవుడ్‌ కన్ను
X
టాలీవుడ్ వర్షం అంటూ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది బాఘీ. టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ లు జంటగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. హిందీ సినిమాకి సమానంగా టాలీవుడ్ లోనూ ఈ మూవీకి ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు నటించిన సినిమా కావడంతో.. ఇక్కడ మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు బాఘీ నిర్మాతలు ప్లాన్ చేశారు. మరోవైపు సుధీర్ కూడా తన యాక్టింగ్ ట్యాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇందుకోసం మహేష్ బాబునే ఆయుధంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు యూనిట్. నిజానికి మహేష్ బావ అయినా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటివరకూ సుధీర్ కి అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో కొంచెం ఛేంజ్ కనిపిస్తోంది.

సుధీర్ బాబు కెరీర్ లో మంచి సినిమాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన భలే మంచి రోజుకు రివ్యూల నుంచి రిపోర్టుల వరకూ.. ఇండస్ట్రీ నుంచి మౌత్ టాక్ వరకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. సినిమా మాత్రం అంతగా ఆడలేదు. అయితే.. ఈ సిట్యయేషన్ ను మార్చాలంటే.. మహేష్ బాబు స్వయంగా ప్రచారం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే బాఘీ ప్రచారం కోసం మహేష్ బాబును ఉపయోగించుకునేందుకు ట్రై చేస్తోంది నిర్మాణ సంస్థ. టాలీవుడ్ ప్రిన్స్ కనుక ప్రమోషన్స్ లో పాల్గొంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి కలెక్షన్స్ వస్తాయని బాఘీ నిర్మాతలు భావిస్తున్నారు.