Begin typing your search above and press return to search.

మహేష్‌ ను సైడ్‌ చేస్తున్న పివిపి

By:  Tupaki Desk   |   4 Dec 2015 6:26 AM GMT
మహేష్‌ ను సైడ్‌ చేస్తున్న పివిపి
X
ప్రిన్స్ మ‌హేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో బ్ర‌హ్మోత్స‌వం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పివిపి సినిమా ప‌తాకంపై పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నాటికి సినిమాని పూర్తి చేసి ఎట్టి ప‌రిస్థితుల్లో మార్చిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నామ‌ని ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు.

కానీ ఇప్పుడు రిలీజ్ తేదీ మారుతుంద‌ని చెబుతున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం మ‌హేష్ టీమ్ ఆలోచ‌న మార్చుకుంద‌ని చెబుతున్నారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం రంజిత్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌బాలీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 10న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే వేగంగా సినిమాని పూర్తి చేస్తున్నారు. అయితే ర‌జ‌నీకాంత్ క‌బాలీకి ఎదురెళ్ల‌డం ఇష్టం లేకే పీవీపీ రిలీ్ తేదీని మార్చే ప్లాన్‌లో ఉన్నార‌ట. బ్ర‌హ్మో త్స‌వం చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ రిల‌జ్ చేయాల‌న్న‌ది పీవీపీ ప్లాన్‌.

ఇకపోతే ఇప్ప‌టికే సైజ్ జీరో ప‌రాజ‌యం పీవీపీని కాస్త చికాకు పెట్టింది. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితిలో మ‌హేష్ సినిమాని స‌రైన టైమింగుతో రిలీజ్ చేసి హిట్ కొట్టాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్ అన్న‌మాట‌!