Begin typing your search above and press return to search.

పిక్ టాక్: యాక్షన్ అవతారాల్లో 'మహాసముద్రం' హీరోలు.. !

By:  Tupaki Desk   |   20 Sep 2021 11:48 AM GMT
పిక్ టాక్: యాక్షన్ అవతారాల్లో మహాసముద్రం హీరోలు.. !
X
'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''మహాసముద్రం''. ఇందులో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనూహ్యమైన స్క్రీన్ ప్లే - ఆసక్తికరమైన మలుపులతో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

'మహా సముద్రం' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - రెండు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ అప్డేట్ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 23న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా 'మహా సముద్రం' చిత్రం నుంచి ఓ సరికొత్త పోస్టర్ ని వదిలారు. ఇందులో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ మాస్ అండ్ యాక్షన్ అవతారాలలో కనిపిస్తున్నారు. ఇద్దరూ యాక్షన్ కోసం రెడీ అవుతున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. మరి ఈ ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో తెలియాలంటే దసరా పండగ వరకు ఆగాల్సిందే.

కాగా, 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ - శరణ్య లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.