Begin typing your search above and press return to search.

మజ్నూకి మూడో భామ దొరికిందోచ్

By:  Tupaki Desk   |   21 Jan 2016 5:30 AM GMT
మజ్నూకి మూడో భామ దొరికిందోచ్
X
మళయాళ మూవీ ప్రేమమ్ ని తెలుగులో మజ్నూ పేరుతో రీమేక్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. నవంబర్ లో స్టార్ట్ చేసిన ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో ఒకే పాత్రకు చెందిన టీనేజ్ - కాలేజ్ - మెచ్యూర్డ్ యువకుడి దశల్లో చైతు కనిపించనున్నాడు. ఈ మూడు స్టేజ్ లలోనూ ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంటుంది.

ఇప్పటికే టీనేజ్ స్టేజ్ కోసం ప్రేమమ్ లో నటించిన అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారు. కాలేజ్ దశలో ఉండగా లెక్చరర్ తో ప్రేమలో పడతాడు హీరో. ఈ లెక్చరర్ పాత్ర కోసం శృతి హాసన్ ను ఫైనల్ చేసి, షూటింగ్ కూడా చేసేస్తున్నారు. ఇక మూడో హీరోయిన్ కోసం ఇప్పటికే చాలా మందిని అనుకున్నారు. ఐషా శర్మ - రెజీనా కసాండ్రా - రకుల్ ప్రీత్ సింగ్ లను తీసుకోవాలని భావించినా, అవేవీ వర్కవుట్ కాలేదు. చివరికి మళయాళ మూవీలో ఈ పాత్రను చేసిన మడొన్నా సెబాస్టియన్ నే ఫైనల్ చేయాలని నిర్ణయించారు.

ప్రేమమ్ లో ఈమె పాత్ర సర్ ప్రైజ్ ఇచ్చేలా ఈమె ఎంట్రీ ఉంటుంది. అక్కడ అది బాగా క్లిక్ అయింది. అందుకే తెలుగులో కూడా ఈ రోల్ ను ఆమెతోనే చేయించాలని డిసైడ్ అయ్యారు యూనిట్. మొత్తానికి ముగ్గురు భామలు దొరికేయడంతో.. ఇక నాన్ స్టాప్ గా మజ్ను షూటింగ్ జరిగే అవకాశాలున్నాయి. సమ్మర్ నాటికి స్క్రీన్ లపైకి తెచ్చేయాలన్నది మజ్ను యూనిట్ ఆలోచన.