Begin typing your search above and press return to search.

`మ‌ధురా న‌గ‌రిలో`.. రాఘ‌వేంద్రుడి మార్కు

By:  Tupaki Desk   |   30 Sep 2021 2:54 AM GMT
`మ‌ధురా న‌గ‌రిలో`.. రాఘ‌వేంద్రుడి మార్కు
X
ద‌ర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు చిత్రాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణకు ప్ర‌త్యేక‌త వుంటుంద‌న్న‌ది తెలిసిందే. ప‌ల్లు..వీణ‌.. యాపిల్స్‌.. నిమ్మ‌కాయ‌లు.. ఇలా హీరోయిన్‌ల‌ని వీటితో రొమాంటిక్‌ గా పోల్చ‌డం.. వాటిని హీరోయిన్ బొడ్డు పై పూల‌లా చ‌ల్ల‌డం.. రాఘ‌వేంద్ర‌రావు చిత్రాల్లోని పాట‌ల ప్ర‌త్యేక‌త‌. తాజాగా ఆయ‌న డైరెక్ట్ చేయ‌క‌పోయినా.. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న `పెళ్లిసంద‌డి` పాట‌ల్లో ఆయ‌న మార్కు క‌నిపిస్తోంది.

గ‌తంలో శ్రీ‌కాంత్ హీరోగా కె. రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన చిత్రం `పెళ్లి సంద‌డి`. గ‌తంలో లో బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు అదే చిత్రానికి కొన‌సాగింపుగా అదే పేరుతో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోహ‌న్ హీరోగా.. శ్రీ‌లీలని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరీ రోనంకీ తెర‌కెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీర‌వాణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్ర ట్రైల‌ర్ ‌ని సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈమూవీకి సంబంధించి తాజాగా `మ‌ధురా న‌గ‌రిలో..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల చేశారు. 3.38 నిమిషాల నిడివిగ‌ల ఈ లిరిక‌ల్ వీడియో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌లో రోష‌న్‌.. శ్రీ‌వ‌ల్లీల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పాట మ‌ధ్య‌లో రాఘ‌వేంద్ర‌రావు హీరోయిన్‌ ల‌పై పూల‌ని.. కాయ‌ల్ని విసిరిస్తే.. గౌరీ రోనంకీ మాత్రం ఈ పాట‌లో హీరోతో హీరోయిన్ యెద‌పై ఫ్లూట్‌ని వేయించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

దీంతో రాఘ‌వేంద్ర‌రావు మార్కు మ‌ళ్లీ రిపీట్ అయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌ పై శోభు యార్ల‌గ‌డ్డ‌.. ప్ర‌సాద్ దేవినేని.. మాధ‌వి కోవెల‌మూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1996లో మ్యాజిక్ చేసి `పెళ్లి సంద‌డి`కి కొన‌సాగింపుగా రూపొందుతున్న తాజా మూవీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేలానే క‌నిపిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.