Begin typing your search above and press return to search.

పెళ్లి పీఠలెక్కబోతున్న లవ్ బర్డ్స్‌

By:  Tupaki Desk   |   21 Nov 2021 12:30 AM GMT
పెళ్లి పీఠలెక్కబోతున్న లవ్ బర్డ్స్‌
X
బాలీవుడ్‌ లో వరుసగా ప్రేమ పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బాలీవుడ్‌ సెలబ్రెటీలు పెళ్లీలకు దూరంగా ఉన్నారు. పరిస్థితులు చక్కబడటంతో కరోనా కేసులు చాలా వరకు తగ్గడంతో పెళ్లిళ్లకు సిద్దం అవుతున్న సెలబ్రెటీలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా లవ్‌ బర్డ్స్ చాలా మంది 2022 లో ఒక్కటి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రథానంగా ఆలియా భట్ రణ్‌ బీర్‌ కపూర్ లు వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించేశారు. ఇక విక్కీ కౌశల్‌ మరియు కత్రీనాలు కూడా వచ్చే ఏడాదిలో ఒక్కటి అయ్యే అవకాశాలు ఉన్నాయని తేలిపోయింది. ఇదే సమయంలో మరో ఆన్‌ స్క్రీన్‌ కపుల్‌ రియల్ లైఫ్‌ కపుల్‌ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

హాట్‌ హీరోయిన్‌ తారా సుతారియా మరియు నటుడు ఆదార్ జైన్ లు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఒక్కటి అవుతారట. గత కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరు తమ ప్రేమ విషయాన్ని దాచకుండా మొదటి నుండి ఓపెన్ గానే చెబుతూ వస్తున్నారు. ఇద్దరు సోషల్‌ మీడియాలో తరచు కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేయడం.. రొమాంటిక్ వీడియోలను షేర్‌ చేయడం తో ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని బాలీవుడ్‌ మీడియాకు ఎప్పుడో తెలిసి పోయింది.

బాలీవుడ్‌ నుండి వరుసగా పెళ్లి ప్రకటనలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో ఈ జంట పెళ్లి పీఠలు మొదటగా ఎక్కుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ కు వీరి వివాహం ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత ఆలియా భట్ కపుల్‌ ప్రేమ పెళ్లి వరకు వెళ్లబోతుంది. ఇంకా కొందరు కూడా వచ్చే ఏడాదిలో పెళ్లి పీఠలు ఎక్కుతారని చెబుతున్నారు. ఇటీవలే తన సుదీర్ఘ మైన ప్రేమను వివాహ బంధగా హీరో రాజ్‌ కుమార్‌ రావు మార్చుకున్నాడు. ఆయన ప్రేయసి పత్ర లేఖను ఇటీవలే పెళ్లి చేసుకుని సంతోషంగా కొత్త జీవితాన్ని ఆరంభించాడు. ఆ జాబితాలో మరెంతో మంది లవ్ బర్డ్స్ జాయిన్ అవ్వబోతున్నాయి. మొదటగా వచ్చే ఏడాది తారా సుతారియ కపుల్‌ ను మనం పెళ్లి పీఠల మీద చూడబోతున్నాం.