Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఎందుకు కోసం?

By:  Tupaki Desk   |   5 Aug 2022 7:30 AM GMT
రౌడీ స్టార్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఎందుకు కోసం?
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. `సాలా క్రాస్ బీడ్` అని ట్యాగ్ లైన్‌. అన‌న్య పాండే హీరోయిన్ గా ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్‌, మ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్ని పోషించారు.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందిన ఈ మూవీ త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. ఆగ‌స్టు 25న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ లకు మంచి స్పంద‌న ల‌భించింది. రికార్డు స్థాయి వ్యూస్ తో నెట్టింట వైర‌ల్ అయి సినిమాకు భారీ బ‌జ్ ని క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ముందు ముంబై పై దృష్టి పెట్టింది.

ఇటీవ‌ల ముంబైలోని ఓ షాపింగ్ మాల్ ఓ నిర్వ‌హించిన ఈవెంట్ రౌడీ ఫ్యాన్స్ క్రేజ్ తో ద‌ద్ద‌రిల్లిపోయింది. అంచ‌నాలకు మించిన జ‌నం షాపింగ్ మాల్ కు చేర‌డంతో ఒక్క‌సారిగా భారీ క్రౌడ్ ఏర్ప‌డింది.

ముంబైలో సినిమా రిలీజ్ కాకుండానే నాకు క్రేజ్ ఇంత వుందా? అని రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఆశ్చ‌ర్య‌పోయాడు. దూసుకొస్తున్న అభిమానుల్ని క‌ట్ట‌డి చేయ‌డం అక్క‌డున్న సిబ్బందికి ఇబ్బందిగా మార‌డంతో అక్క‌డ వుండ‌టం సేఫ్ కాద‌ని భావించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ అన‌న్య పాండే అక్క‌డి నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లి పోవ‌డం తెలిసిందే.

ఆ త‌రువాత అభిమానుల ప్రేమ‌ని గుర్తు చేసుకుంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ట్వీట్ కూడా మ‌రింత‌గా వైర‌ల్ అయింది. ఇదిలా వుంటే `లైగ‌ర్‌` టీమ్ త‌మ ఫోక‌స్ ని మొత్తం బాలీవుడ్ పై పెట్ట‌డం ఉభ‌య తెలుగు రాష్ట్రాల వైపు చూడ‌క పోవ‌డంతో ఫ్యాన్ప్ హ‌ర్ట‌వుతున్నార‌ట‌. హైద‌రాబాద్ తో పాటు ఏపీలోనూ ప్ర‌మోష‌న్స్ పై టీమ్ దృష్టి పెట్టాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వివ‌రిస్తూ ట్విట్ ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ట‌.

ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టండ‌ని, ఆ త‌రువాత ఇత‌ర భాష‌ల గురించి ఆలోచించండ‌ని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నార‌ట‌. నెట్టింట రౌడీ ఫ్యాన్స్ చేస్తున్న రిక్వెస్ట్ లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మరి ఈ రిక్వెస్ట్ ల‌పై రౌడీ స్టార్ ఎలా స‌మాధానం చెబుతాడో చూడాలి మరి అంటున్నారు.