Begin typing your search above and press return to search.

కొత్త మిషన్ టేకాఫ్ చేయడానికి రెడీ అయిన 'లైగర్' బ్యాచ్..!

By:  Tupaki Desk   |   28 March 2022 5:57 AM GMT
కొత్త మిషన్ టేకాఫ్ చేయడానికి రెడీ అయిన లైగర్ బ్యాచ్..!
X
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ''లైగర్'' అనే పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

‘లైగర్‌’ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ మరోసారి కలవబోతున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

''కొత్త మిషన్ టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉంది. విధ్వంసకర కాంబో విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ ల తదుపరి మిషన్ మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభం కానుంది'' అని సోషల్ మీడియాలో వెల్లడించారు.

పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్ - చార్మీ కౌర్‌ సంయుక్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కోఆర్డినేట్స్ ని మెన్షన్ చేయడాన్ని బట్టి చూస్తుంటే ఏవియేషన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడికానున్నారు.

పూరీ - విజయ్ దేవరకొండ కాంబోలో ‘జనగణమన’ అనే చిత్రం తెరకెక్కనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అప్పుడు మహేష్ బాబుకు చెప్పిన కథనే ఇప్పుడు వీడీతో చేయడానికి రెడీ అయ్యారని టాక్ వచ్చింది. ఏదేమైనా క్రేజీ కాంబోలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు వస్తుందటంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

ఇకపోతే 'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని బజ్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ - రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.