Begin typing your search above and press return to search.

బాబాయి-అబ్బాయిలను లైన్ లో పెట్టిన సొట్టబుగ్గల సుందరి

By:  Tupaki Desk   |   31 March 2020 12:30 PM GMT
బాబాయి-అబ్బాయిలను లైన్ లో పెట్టిన సొట్టబుగ్గల సుందరి
X
సొట్టబుగ్గల సుందరీ లావణ్య త్రిపాఠి ఒకేసారి ఇద్దరు మెగా హీరోలను లైన్టో పెట్టింది. 'అందాల రాక్షసి' మూవీ తో ఈ సొట్టబుగ్గల సుందరీ తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. ఈ మూవీ హిట్టు తో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడి పనైపోయిందని అనుకున్నారంతా. అయితే ఈ అమ్మడు ఒకేసారి ఇద్దరు మెగా హీరోలను లైన్టో పెట్టి అందరు అవాక్కయ్యేలా చేసింది.

లావణ్య త్రిపాఠి తాజా చిత్రం 'అర్జున్ సురవరం' టాలీవుడ్లో మంచి విజయం సాధించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ ఆమె సొట్టబుగ్గలంటే తనకెంతో ఇష్టమని స్టేజీపైనే ప్రకటించాడు. దీంతో లావణ్య త్రిపాఠి సంతోషంగా ఉప్పొంగిపోయింది. ఇదంతా అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నాడు మెగాస్టార్ ను మెస్మరైజ్ చేసిన బ్యూటీ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లను లైన్లో తానేమీ తక్కువగా కాదని నిరూపించింది.

పవన్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్'లో లావణ్య త్రిపాఠి ప్రధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ పవన్ ప్లాష్ బ్యాక్లో వచ్చే కథలో పవన్ సరసన లావణ్య త్రిపాఠి కనిపించనుందని సమాచారం. ఈ మూవీలో ఇప్పటికే నివేథా థామస్, అంజలి, అనన్యలు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి చేరడంతో 'వకీల్ సాబ్'కు మరింత గ్లామర్ చేరింది. అలాగే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న తాజా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.

ఈ మూవీలో బాలీవుడ్ నటి సాయిమంజ్రేకర్ ఒక హీరోయిన్ గా ఎంపికవ్వగా తాజాగా మరో కథానాయకగా లావణ్య త్రిపాఠి ఎంపికైంది. బాక్సింగ్ తో వరుణ్ తేజ్ ప్రత్యర్థులకు చెమటలు పట్టించేందుకు సిద్ధమవగా గ్లామర్ తో హిటెక్కించేందుకు లావణ్య త్రిపాఠి సిద్ధమైంది. ఒకేసారి బాబాయి-అబ్బాయిల తో సొట్టబుగ్గల సుందరీ రోమాన్స్ కు రెడీ అవడం ఉత్కంఠను రేపుతోంది.