Begin typing your search above and press return to search.

పీకే లాగే సాయిప‌ల్ల‌వి క్రేజీ బ్యూటీగా!

By:  Tupaki Desk   |   1 March 2022 8:30 AM GMT
పీకే లాగే సాయిప‌ల్ల‌వి క్రేజీ బ్యూటీగా!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క‌న్నా..వ్య‌క్తిగ‌తంగానే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. పీకే చేసిన సినిమాల సంఖ్య త‌క్కువే అయినా...కోట్లాది మంది హృద‌యాల్లో చిర‌స్థాయి స్థానాన్ని ప‌దిలం చేసుకున్నారంటే ఆయ‌న లో సేవాగుణ‌మే అందుకు పునాది వేసింది. అభిమానుల ప‌ట్ల ఆయ‌న చూపించే ప్రేమాభిమానాలు..సినిమాకి న‌ష్టం వ‌స్తే పారితోషికం నిర్మాత‌కు తిగిరి ఇచ్చేయ‌డం..చేతిలో ఉన్న డ‌బ్బుని సామాజిక దృక్ఫ‌దంతో ఖ‌ర్చు చేసేయడం వంటి అంశాల‌తోనే ప‌వ‌న్ అభిమానుల‌కు వ్య‌క్తిగ‌తంగా ద‌గ్గ‌ర‌గా చేర్చింద‌న్నది వాస్త‌వం.

కోట్లాది రూపాయ‌లు అడ్వాన్సులుగా ఇస్తామ‌న్నా..వ‌ద్ద‌నే గుణం ఆయ‌న్ని అంత‌డి వాడిని చేసింది. త‌న‌లో రియ‌ల్ నేచుర్ ని ఇష్ట‌ప‌డ్డ వారే అధికంగా ఉంటారు. అందుకే పీకే జ‌నంలో జ‌న‌సైన్యం అయ్యాడు. స‌రిగ్గా ప‌వ‌న్ క్వాలీటిల్లో కొన్నింటికి ద‌గ్గ‌ర‌గా ఓ హీరోయిన్ ఉంది. ఆమె సాయి ప‌ల్ల‌వి. `ఫిదా` సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన బ్యూటీ చాలా సినిమాల్లో న‌టించింది. న‌టిగా ఇంకా ఎదుగుతూనే ఉంది. సినిమాల్లోకి కొన్ని నిబంధ‌న‌ల‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికీ వాటిని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూ కెరీర్ లో ఎదుగుతోంది. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఐదేళ్లే అవుతుంది.

కానీ ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ చూస్తే మ‌తిపోతుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే భారీగా అభిమానుల్ని సంపాదించింది. ఇన్ స్టాలో హాట్ ఫోటోలు ఉండ‌వు. బికీనీ..టూపీస్ లు ధ‌రించ‌దు. అయినా ఫాలోవ‌ర్స్ భారీగానే ఉన్నారు. ఇక ఆన్ లైన్ అభిమానం క‌న్నా ఆఫ్ లైన్ లో మ‌రింత మంది ప‌ల్ల‌వి అభిమానులుగా కొన‌సాగుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజ‌రైన బ్యూటీ క్రేజ్ చూస్తే ఇంత ఉందా? అన్న సందేహం రాక మాన‌దు. సాయి ప‌ల్ల‌వికి ఆ ఈవెంట్ జానాలు ఆరేంజ్ లో బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. వాస్త‌వానికి ఆ సినిమాలో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌. సాయి ప‌ల్ల‌వి అతిధిగా మాత్ర‌మే విచ్చేసింది. కానీ ప‌ల్ల‌వి పేరు చెప్ప‌గానే ఆడిటోరియం మారు మ్రోగిపోయింది. వీళ్లంతా సాయి ప‌ల్ల‌విని స్వ‌చ్ఛందంగా ఎంతో అభిమానిస్తున్నారు.

ఎలాంటి పీఆర్ లేకుండానే కేవ‌లం త‌న ట్యాలెంట్ తోనే ఇంత మంది అభిమానుల‌ల్ని సంపాదించుకుంది. ప‌రిమితంగా కొన్ని సినిమాలే చేస్తుంది. బోల్డ్ స‌న్నివేశాల‌కు నిర్మోహ‌మాటంగా నో చెప్పేస్తుంది. పాత్ర‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ ప్రాజెక్ట్ ల్నే వ‌దులుకుంది. వృత్తికి క‌ట్టుబ‌డి ఉండ‌టం..త‌న‌లో డాన్సింగ్ స్కిల్స్..గ్రౌండ్ నేచుర్ తోనే ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆ మ‌ధ్య ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ న‌టించ‌డానికి కోట్ల రూపాయాల ఆఫ‌ర్ వ‌చ్చినా...నా పేరుతో వాటిని బ‌య‌ట‌కి పంపించిన త‌ర్వాత ఫలితాలు మ‌రోలా ఉంటే దానికి నేనే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని ఫెయిర్ నెస్ బ్రాండ్ ఆఫ‌ర్ నే తిర‌స్క‌రించింది.

మాట ఇస్తే అంత‌గా క‌ట్టుబ‌డి ఉండాలి అన్న త‌న‌లో ఆ ల‌క్ష‌ణం మ‌రింత మంది అభిమానుల‌కు ద‌గ్గ‌ర చేసింది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి రానా స‌ర‌స‌న `విరాట ప‌ర్వం`లో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.