Begin typing your search above and press return to search.

స్పీడు పెంచేస్తూ షాకిస్తున్న ఎన్టీఆర్‌!

By:  Tupaki Desk   |   17 March 2022 1:30 AM GMT
స్పీడు పెంచేస్తూ షాకిస్తున్న ఎన్టీఆర్‌!
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌` ఫైన‌ల్ గా మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దాదాపు మూడేళ్లు శ్ర‌మించారు. వీరి శ్ర‌మ త్వ‌ర‌లో ఫ‌లించ‌బోతోంది. వెండితెర‌పై `ఆర్ ఆర్ ఆర్‌`తో ఈ ఇద్ద‌రు హీరోలు అద్భుతం సృష్టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోస్ ప‌రంగా ఈమూవీ అన్ బిలీవ‌బుల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మూడేళ్లు శ్ర‌మించిన మూవీ రిలీజ్ అవుతున్న వేళ హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాల‌ని ప‌ట్టాలెక్కించ‌డం మొద‌లు పెట్టారు.

శంక‌ర్ డైరెక్ష‌న్ లో భారీ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్లర్ ని చేస్తున్న చ‌ర‌ణ్ ఈ చిత్ర షూటింగ్ ని ఇప్ప‌టికే ప్రారంభించారు. కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. పిరియాడిక్ నేప‌థ్యంలో సాగే పొలిటిక‌ల్ డ్రామాగా ఈ మూవీని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీతో పాటు త్వ‌ర‌లో `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో చ‌ర‌ణ్ ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

`ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత ఒక మూవీని ప్రారంభించి చ‌ర‌ణ్ మ‌రో మూవీకి రెడీ అవుతుంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఏంటీ ఇంకా సైలెంట్ గా వున్నారంటూ ఇటీవ‌ల వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సైలెంట్ గానే రెండు చిత్రాల‌ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో వున్నార‌ని తెలిసింది. `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` త‌రువాత దాదాపు నాలుగేళ్ల పాటు `ఆర్ ఆర్ ఆర్‌` కే కేటాయించారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయ‌కుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

ఇందులో భాగంగా ఒకేసారి రెండు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌ని సెట్స్ పైకి తీసుకెళ్లా ప్యార‌ల‌ల్ గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల ము్ందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ 30 వ చిత్రం చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఇదుగో ముహూర్తం అంటూ ఊరిస్తున్న ఈమూవీని త్వ‌ర‌లోనే లాంఛ‌నంగా ప్రారంభించి వెంట‌నే మ‌రో చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకురావాల‌నుకుంటున్నార‌ట‌. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

అ మూవీతో పాటు `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్ లో ఓ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌బోతున్నార‌ట‌.

ఈ రెండు చిత్రాల షూటింగ్ ల‌ని ఒకే స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని ప‌క్కా ప్లాన్ తో ఎన్టీఆర్ వున్నార‌ని, ఈ ఏడాది చివ‌ర‌క‌ల్లా ఈ రెండు ప్రాజెక్ట్ ల‌ని పూర్తి చేయ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న బుచ్చిబాబు - ఎన్టీఆర్ చిత్రానికి `పెద్ది` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌రువాత ఎన్టీఆర్ మ‌రో ముగ్గురు క్రేజీ డైరెక్ట‌ర్లు త్రివిక్ర‌మ్‌, అట్లీ, ప్ర‌శాంత్ నీల్ ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌బోతున్నారు.