Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ క్రేజీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   25 March 2022 10:31 AM GMT
ప్ర‌భాస్ క్రేజీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
X
క్రేజీ సినిమాల‌కు సీక్వెల్స్ చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో భారీ చిత్రానికి సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు వున్న‌ట్ఠుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి`తో తెలుగులో ద‌ర్శ‌క‌ధీరుడు సీక్వెల్స్ ట్రెండ్ ని క్రియేట్ చేశారు. అదే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ‌వుతోంది. ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ ప్ర‌శాంత్ నీల్ చేసిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఏప్రిల్ 14న ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదిలా వుంటే ప్ర‌భాస్ న‌టించిన క్రేజీ మూవీ `ఆదిపురుష్‌`కు కూడా సీక్వెల్ రానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ ఇది. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్ కి సంబంధించిన ప‌నులు జోరుగా సాగుతున్నాయి.

ఇందులో హీరో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుండ‌గా, సీత పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. ఇదే మూవీతో ప్ర‌భాస్ బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.

అవ‌తార్ త‌ర‌హా మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందుతున్న ఈ చిత్రానికి వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ కీలకంగా మార‌డం, దీనికే అత్య‌ధిక స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుండ‌టంతో ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసిన ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్రమాల్లో బిజీగా వున్నార‌ట‌.

వీఎఫ్ ఎక్స్ కార‌ణంగా రిలీజ్ ఆల‌స్యం కానున్న ఈమూవీని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టించింది కూడా. అయితే ఓ ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేస్తూనే ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ మూవీ సీక్వెల్ ని తెర‌పైకి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌ని ప్ర‌భాస్ కు చెప్పార‌ట‌. ఆలోచ‌న న‌చ్చ‌డంతో ప్ర‌భాస్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్ నుంచి సిగ్న‌ల్ రావ‌డంతో ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ పై క‌స‌ర‌త్తులు చేయ‌డం మొద‌లు పెట్టార‌ట‌. క‌త పూర్తి కాగానే వ‌చ్చే ఏడాది ఈ సీక్వెల్ ని ప‌ట్టాలెక్కించాల‌నే ప్లాన్ లో ద‌ర్శ‌కుడు వున్నార‌ని, ప్ర‌భాస్ కూడా సీక్వెల్ కు డేట్స్ ని కేటాయించ‌డానికి రెడీ అవుతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్‌, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా వ‌చ్చే ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.