Begin typing your search above and press return to search.

సర్కారు వారి ప్రమోషనల్ సాంగ్ లేటెస్ట్ అప్డేట్..?

By:  Tupaki Desk   |   25 April 2022 9:30 AM GMT
సర్కారు వారి ప్రమోషనల్ సాంగ్ లేటెస్ట్ అప్డేట్..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'సర్కారు వారి పాట' చిత్రానికి మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ఇంస్టెంట్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'కళావతి' మరియు 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియోలు మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తుండగా.. లేటెస్టుగా వచ్చిన థీమ్ సాంగ్ సెన్సేషనల్ హిట్‌ అయింది.

ఈ క్రమంలో ఇప్పుడు సర్కారు వారి ప్రమోషనల్ వీడియో చేయనున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తమన్ ఈ పాటని యువ గాయని జోనితా గాంధీతో పాడించనున్నారని తెలుస్తోంది. జోనిత మ్యూజికల్ ఇండస్ట్రీలో తాజా సంచలనం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఆమె పాడిన ప్రతీ పాట చార్ట్ బస్టర్ అవుతోంది. అందుకే ప్రతీ సంగీత దర్శకుడు జోనిత తో ఒక పాట పాడించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంతకముందు థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన 'కిక్ 2' సినిమాలో 'నువ్వే నువ్వే' అనే పాట పాడింది జొనితా. గతేడాది 'లవ్ స్టోరీ' చిత్రంలో 'ఏవో ఏవో కలలే' అనే గీతాన్ని ఆలపించింది. ఇటీవల 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు - హలమితి హబీబో' సాంగ్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాలో ఓ సాంగ్ పాడినట్లుగా తెలుస్తోంది. ఈ పాట ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్. మది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.