Begin typing your search above and press return to search.

అజిత్ ని బోనీ ఇక వ‌ద‌ల‌డా?

By:  Tupaki Desk   |   12 April 2022 7:32 AM GMT
అజిత్ ని బోనీ ఇక వ‌ద‌ల‌డా?
X
స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌కు త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కామ‌ధేను క‌ల్ప‌వృక్షంలా మారుతున్నారు. న‌ష్టాల్లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌కు అవ‌కాశాలిస్తూ బ్యాక్ టు బ్యాక్ వారితో సినిమాలు చేస్తూ వారికి స్ట్రాంగ్ పిల్ల‌ర్‌లా మారుతున్నారు. న‌ష్టాల్లో వున్న నిర్మాత‌ల‌కి అండ‌గా నిల‌బ‌డుతూ మ‌ళ్లీ వారిని ట్రాక్ లోకి తీసుకొస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌తంలో ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్ ని న‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డేసి అత‌ని కెరీర్ ని, లైఫ్ ని మ‌లుపు తిప్పిన స్టార్ హీరో అజిత్ ఇప్ప‌డు బాలీవుడ్ నిర్మాత‌కు వ‌రుస‌గా అవ‌కాశాలిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మాత ఏ.ఎం. ర‌త్నం. అయితే'బంగారం' త‌రువాత ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్ చేసిన కేడీ, విజ‌య్ కాంత్ తో చేసిన'ధ‌ర్మ‌పురి', చియాన్ విక్ర‌మ్ తో చేసిన'భీమా' చిత్రాలు భారీ వైఫ‌ల్యాల‌ని అందించాయి. దీంతో స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చ‌విచూశారు. మ‌ళ్లీ సినిమాల్లో బిజీగా కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే ఆయ‌న‌కు హీరో అజిత్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించారు.

విష్ణు వ‌ర్థ‌న్ డైరెక్ష‌న్ లో చేసిన'ఆరంభం', గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్ లో చేసిన'ఎన్నై అరిందాల్‌'(ఎంత వారు గాని),'సిరుతై' శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన'వేదాలం' వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని అందించి స‌ద‌రు నిర్మాత‌ని మ‌ళ్లీ స్టార్ ప్రొడ్యూస‌ర్ గా నిల‌బెట్టాయి. ఇప్ప‌డు ఇదే నిర్మాత త‌ర‌హాలో అజిత్ కుమార్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ తో వ‌రుస చిత్రాలు చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్'పింక్' ఆధారంగా త‌మిళంలో రీమేక్ చేసిన చిత్రం'నేర్కొండ పార్వై'. ఈ చిత్రంలో తొలిసారి బోనీక‌పూర్ తో సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టారు అజిత్‌. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో వెంట‌నే ఆయ‌న నిర్మాణంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా'వాలిమై' చిత్రాన్ని చేశారు. ఈ రెండు చిత్రాల‌కు బోనీ క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.'ఖాకీ' ఫేమ్ హెచ్ వినోద్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

ఈ ముగ్గురు క‌లిసి ముచ్చ‌ట‌గా మ‌రో భారీ యాక్ష‌న్ ఎడ్వెంచ‌ర్ ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగాయి. అదే రోజు ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని కూడా ప్రారంభించేశారు.'వాలిమై' బిజినెస్ ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టించినా తెలుగులో మాత్రం ఆ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది.

కానీ త‌మిళంలో మాత్రం రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల‌ని కూడా భారీ స్థాయిలోనే రాబ‌ట్టింది. ఈ క్రేజీ కాంబినేష‌న్ కి జీ స్టూడియో కూడా యాడ్ అవ్వ‌డంతో మూడ‌వ సినిమా ఓ రేంజ్ లో వుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తుండ‌గా అజిత్ ని బోనీ ఇక వ‌ద‌ల‌డా? అని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు.