Begin typing your search above and press return to search.

సుప్రీమ్ హీరో సెట్స్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:30 AM GMT
సుప్రీమ్ హీరో సెట్స్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..?
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ - ఐకియా సమీపంలో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు.బీప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తేజ్ ఆరోగ్యం పెరుగుపడింది. తాను కోలుకుంటున్నట్టు సాయి తేజ్ స్వయంగా తెలియజేస్తూ థంబ్ సింబల్ తో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆరోగ్యం మెరుగైన వెంటనే సుప్రీమ్ హీరో షూటింగ్ లో పాల్గొనాబోతున్నారట. అంతా బాగుంటే న‌వంబర్ నుంచే సాయి తేజ్ సెట్స్ లోకి అడుగుపెట్ట‌నున్నట్లు చెప్పుకొంటున్నారు. కాగా, 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తేజ్.. 'ప్రతీరోజూ పండగే' చిత్రంతో తన మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రంతో పర్వలేదనిపించాడు. తాజాగా 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

'ప్రస్థానం' ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ''రిపబ్లిక్'' సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. డీసెంట్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా.. చెప్పాలనుకున్న పాయింట్ ని ఎక్కడా పక్కదారి పట్టకుండా తెర మీదకు తీసుకొచ్చారని మెచ్చుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ పరిణితి చెందిన నటన కనబర్చారనే ప్రశంసలు వస్తున్నాయి.

తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత #SDT15 షూటింగ్ లో పాల్గొననున్నారు. 'భమ్ బోలేనాథ్' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామి గా ఉండటమే కాకుండా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానరర్స్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.