Begin typing your search above and press return to search.

హీరోగా ఆఫ్ స్క్రీన్‌ లో ఉన్నా VD కి అది ఎలా సాధ్యమైంది..??

By:  Tupaki Desk   |   15 March 2022 10:30 AM GMT
హీరోగా ఆఫ్ స్క్రీన్‌ లో ఉన్నా VD కి అది ఎలా సాధ్యమైంది..??
X
'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'నోటా' 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

2020 ప్రారంభంలో విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' పరాజయం తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి గత రెండు సంవత్సరాల్లో మరో మూవీ రాలేదు. నిర్మాతగా తన తమ్ముడితో సినిమా చేసాడు కానీ.. హీరోగా మాత్రం ఆఫ్ స్క్రీన్‌ లో ఉన్నాడు.

అయినప్పటికీ టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ హీరో వంటి మొదలగు సర్వేల జాబితాలో వీడీ ఉండగలిగాడు. సినిమాలు చేసినా చేయకపోయినా.. చివరి సినిమా ప్లాప్ అయినా యువ హీరో అలాంటి ఫీట్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అందుకే సినిమాలతో పలకరించకపోయినా విజయ్ దేవరకొండ ప్రేక్షకులలో తన బజ్ ని కొనసాగిస్తున్నాడా? లేదా సర్వేలను మేనేజ్ చేస్తున్నాడా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. నిజానికి విజయ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని గతంలో అనేకసార్లు నిరూపించాడు.

సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం.. నెట్టింట అతని గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుండటంతో మూడుసార్లు టైమ్స్ మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ గా వీడీ నిలిచాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇలాంటి ఘనత సాధించిన మరో హీరో లేరనే చెప్పాలి.

ఇకపోతే విజయ్ దేవరకొండ ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. 2022 ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వీడీ పాపులారిటీ బౌండరీస్ దాటుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో సుకుమార్ మరియు పూరీ లతో విజయ్ వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారు.