Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌-శంక‌ర్ టైటిల్ ఇదేనా?

By:  Tupaki Desk   |   9 March 2022 8:35 AM GMT
చ‌ర‌ణ్‌-శంక‌ర్ టైటిల్ ఇదేనా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌న 15వ చిత్రం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ మార్క్ కంటెంట్ తో చ‌ర‌ణ్ ఇమేజ్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్ల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ మొత్తం స్థానికంగానే జ‌రిగింది.

హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో.. రాజ‌మండ్రి ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. ఇంకా విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేయ‌లేదు. అయితే ఇందులో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచే ఒక‌టే క్యూరియాసిటీ నెల‌కొంది. చ‌ర‌ణ్ పాత్ర‌ని శంక‌ర్ ఎలా డిజైన్ చేసారు? అని అభిమానుల్ని సైతం తొలిచేస్తోంది.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ రెండు డిఫ‌రెంట్ వేరియ‌ష‌న్స్ ఉన్న రోల్స్ లో క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఐపీఎస్ ఆఫీస‌ర్ గా పనిచేసే చ‌ర‌ణ్ వ్య‌వ‌స్థ‌లో మార్పుల‌కు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయా నాయ‌కుడిగా ట‌ర్న్ తీసుకుంటారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌తో పాటు..స‌మాజంలో వ‌చ్చే మార్పుల్ని సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఈ ప్ర‌చారానికి ఊతం ఇస్తూ కంటెంట్ కి త‌గ్గ టైటిల్ ఒక‌టి డిసైడ్ చేస్తున్న‌ట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి `స‌ర్కారోడు` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు గుస గుస వినిపిస్తోంది.

సినిమా ఇతివృత్తానికి ప‌క్కాగా యాప్ట్ అయ్యే టైటిల్ అని అంటున్నారు. మ‌రి వీట‌న్నింటిపై క్లారిటీ రావాలంటే? ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్ప‌టికే సినిమాకి సంబంధించి ఒకే ఒక్క ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. అందులో చ‌ర‌ణ్ స‌హా శంక‌ర్ టీమ్ అంతా సూటుబూటు వేసుకుని అధికారుల హ‌డావుడిని హైలైట్ చేసారు. ఈ నేప‌థ్యంలో మార్చి 27న వీటిపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మార్చి 27న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ రోజున సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

అలాగే చ‌ర‌ణ్ లుక్ ని..టైటిల్ ని కూడా రివీల్ చేస్తార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో `స‌ర్కారోడు` టైటిల్ బ‌య‌ట‌కు వచ్చింద‌నే ప్ర‌చారం మొద‌లైంది. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏంటి? అన్న‌ది మేక‌ర్స్ స్పందిస్తే గానీ తెలియ‌దు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ కి జోడీగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టిస్తోంది.

చ‌ర‌ణ్ తో కియారా క‌లిసి న‌టించడం ఇది రెండ‌వ‌సారి. గ‌తంలో `విన‌య విధేయ రామ‌`లో న‌టించింది. కానీ ఆ సినిమా పెద్ద స‌క్సెస్ అవ్వ‌లేదు. అయినా శంక‌ర్ డిజైన్ చేసిన హీరోయిన్ పాత్ర‌కు కియారా అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని ఏరికోరి చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఎంపిక చేసారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.