Begin typing your search above and press return to search.

మంచు విష్ణు ఎందుకు న‌వ్వాడు.. ఏమా క‌థ‌?

By:  Tupaki Desk   |   23 Feb 2022 7:31 AM GMT
మంచు విష్ణు ఎందుకు న‌వ్వాడు.. ఏమా క‌థ‌?
X
మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ గ‌త కొన్ని రోజులుగా నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. సినీ ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం వైఎస్ జ‌గ‌న్ తో ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవితో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ - స్టార్ డైరెక్టర్స్ రాజ‌మౌళి - కొర‌టాల శివ ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

భేటీ అనంత‌రం ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లో శుభం కార్డ్ ప‌డ‌బోతోందంటూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. అయితే ఈ భేటీ జ‌రిగిన రెండు మూడు రోజులు త‌రువాత మంచు విష్ణు ప్ర‌త్యేకంగా ఏపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో భేటీ కావ‌డం.. మ‌ర్యాద పూర్వ‌కంగానే క‌లిశాన‌ని చెబుతూనే ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించామ‌ని మంచు విష్ణు చెప్ప‌డం వివాదానికి దారితీసింది.

అక్క‌డి నుంచి హీరో మంచు విష్ణుని నెట్టింట నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత జ‌రిగిన `స‌న్ ఆఫ్ ఇండియా` ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో మంచు ల‌క్ష్మీ, మోహ‌న్ బాబు మాట్లాడిన తీరుపై కూడా నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట ట్రోలింగ్ హ‌ద్దులు దాట‌డంతో ప‌ది కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేస్తామంటూ హీరో మోహ‌న్ బాబు త‌మ‌ని ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్ ల‌పై మండి ప‌డ్డారు.

ఇకపై త‌మ ఫ్యామిలీని నెట్టింట ట్రోల్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ మంచు వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా ఆ మంచు వారి వార్నింగ్ పై కూడా నెట్టింట ట్రోలింగ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై కూడా ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు చేస్తూ నెటిజ‌న్స్ మ‌రో సారి ట్రోలింగ్ కి పూనుకున్నారు. ఈ నేప‌థ్యంలో హీరో మంచు విష్ణు సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

న‌వ్వుతున్న ఫొటోని షేర్ చేసిన మంచు విష్ణు ఆ ఫొటోకు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశారు. త‌ను పోస్ట్ ఫోన్ లో ఏదో చూస్తూ మంచు విష్ణు న‌వ్వుతూ క‌నిపించాడు. `నేను ఎందుకు న‌వ్వుతున్నానో మీకు తెలుసా? అని త‌న ఫొటోకి మంచు విష్ణు క్యాప్ష‌న్ ఇచ్చారు. అయితే దీనిపై కూడా నెట్టింట ట్రోలింగ్ మొద‌లు కావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మీమీద నెట్టింట వ‌స్తున్న ట్రోలింగ్స్ చూసి న‌వ్వుతున్నారా? .. లేక మీమ్స్ చూసి న‌వ్వుకుంటున్నారా? .. `స‌న్ ఆఫ్ ఇండియా` కు వ‌చ్చిన క‌లెక్ష‌న్ లు చూసి న‌వ్వుకుంటున్నారా? అంటూ నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. మ‌రీ హ‌ద్దులు దాటి ట్రోలింగ్ కి దిగుతున్న వారిపై మంచు విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటా రో ?.. వీటికి ఎలా అడ్డ‌క‌ట్ట వేస్తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.