Begin typing your search above and press return to search.

ఈషా రెబ్బా తో ఫ్యామిలీ డైరెక్టర్ వెబ్ సిరీస్

By:  Tupaki Desk   |   23 March 2022 11:30 PM GMT
ఈషా రెబ్బా తో ఫ్యామిలీ డైరెక్టర్ వెబ్ సిరీస్
X
`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెర‌గ‌డంతో చిన్న సినిమాలు, స్మాల్ మేక‌ర్స్ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో రావ‌డం మొద‌లైంది. ఇలాంటి క‌థ‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో పాటు వీటిని మార్కెట్ చేసుకోవ‌డం కూడా ఈజీ కావ‌డంతో చాలా మంది మేక‌ర్స్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తో పాటు వెబ్ సిరీస్ ల‌ని రూపొందించ‌డం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగానే శ‌ర్వానంద్ తో `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌ ని అందించిన ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ తాజాగా డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

`క‌థ‌లు` (మీవి - మావి) అంటూ ఓ వెబ్ సిరీస్ అంథాల‌జీకి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయ‌న ముందుగా `ప‌డ‌వ‌` అనే పేరుతో ఓ అంథాల‌జీని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న వేగేశ్న స‌తీస్ తోలిసారి ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా స‌తీష్ వేగేశ్న తన‌యుడు స‌మీర్ వేగేశ్న హీరోగా న‌టిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, దుశ్యంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ అంథాల‌జీ `ప‌డ‌వ‌` మోష‌న్ పోస్ట‌ర్ ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ కి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా ఈ సిరీస్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన మూడు ఎపిసోడ్ ల షూటింగ్ పూర్త‌యింది. మిగ‌తా క‌థ‌లు చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది.

త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ముఖ ఓటీటీ ద్వారా `క‌థ‌లు` సీరీస్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈషా రెబ్బా ఇప్ప‌టికే మారుతి రూపొందించిన `3 రోజెస్‌` వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్ర‌య‌త్నం మంచి ఏరు తీసుకొచ్చింది. తాజాగా ఈషారెబ్బాతో వేగేశ్న స‌తీష్ చేస్తున్న `ప‌డ‌వ‌` అంథాల‌జీ ఆమెకు ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్ కు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా దాము, పాట‌లు శ్రీ‌మ‌ణి.