Begin typing your search above and press return to search.

షాకింగ్‌: ఆట‌గాళ్ల మ‌న‌సు దోచి డిస్ట్ర‌బ్ చేస్తోంది!

By:  Tupaki Desk   |   18 March 2022 7:48 AM GMT
షాకింగ్‌: ఆట‌గాళ్ల మ‌న‌సు దోచి డిస్ట్ర‌బ్ చేస్తోంది!
X
ఆట‌గాళ్ల మ‌న‌సు దోచింది. ఆట‌ను డిస్ట్ర‌బ్ చేసింది. అస‌లు ఎవ‌రూ స‌రిగా ఆట‌పై కాన్ స‌న్ ట్రేట్ చేయ‌లేక‌పోతున్నారు. అందుకు కార‌కులు ఎవ‌రు? అంటే.. ఇదిగో ఇక్క‌డ ఉన్న అందాల స‌మంత‌. ఇంత‌కీ స‌మంత ఎందుక‌లా డిస్ట్ర‌బ్ చేసింది? అన్న‌దానికి ఈ వీడియో చూడాల్సిందే.

ఇంత‌కీ ఈ వీడియోలో ఏం ఉంది? అంటే... స‌మంత అలా టెన్నిస్ చాంపియ‌న్ టోర్నీ వీక్ష‌ణ‌కు ఆడిటోరియం గ్యాలెరీకి విచ్చేసి సైలెంట్ గా ఆట చూస్తుందా అంటే అదేమీ లేదు. అక్క‌డ కూల్ కూల్ గా ఫాంటాని చేతిలోకి తీసుకుని హాయిగా గొంతులో ఒంపుకుంటోంది. అయితే మామూలుగా తాగొచ్చుగా.. కానీ కుద‌రలేదు. దాహం తీరేలా క‌సిగా ఫాంటాను పెద్ద చ‌ప్పుడు చేస్తూ తాగేస్తోంది. అంత సీరియ‌స్ గా గేమ్ న‌డుస్తుంటే అక్క‌డ ఆ చప్పుల్లేమిటీ?

అందుకే పాపం ఆట‌గాళ్లు డిస్ట్ర‌బ్ అయ్యారు. ఎక్క‌డ ఆ శ‌బ్ధాలు? అంటూ అటువైపు కొర‌కొరా చూశారు. మొత్తం సీటింగ్ గ్యాల‌రీ ఈ స‌న్నివేశానికి ప‌డి ప‌డీ న‌వ్వింది. కానీ స‌మంత మాత్రం ఫాంటా తాగ‌డం ఆప‌లేదు. స‌రికాదు.. రెండు పీపాల ఫాంటాను అవ‌లీల‌గా తాగేస్తాను అన్న‌ట్టుగా క‌నిపించిది. బాప్ రే..! అస‌లు ప్ర‌క‌ట‌న ఏంటీ ఇంత చెత్త‌గా ఛీఛీ అని చీద‌రించుకునేలా ఉంటున్నాయి చాలా ప్ర‌క‌ట‌న‌లు. కానీ ఈ ప్ర‌క‌ట‌న కాస్త బుర్ర‌వాడి తెర‌కెక్కించిన‌ట్టే ఉంది! అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. బార్బ‌ర్ షాప్ లో క‌త్తెర‌తో క‌ట్ చేస్తారొక హీరోగారు.. ఇంత‌కుముందు మరో ప్ర‌ముఖ హీరో న‌టించిన యాడ్ పైనా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు స‌మంత యాడ్ కి మాత్రం పేరు పెట్ట‌లేరు ఎవ‌రూ! అంత సీరియ‌స్ ఆట‌లో ఆవిడ‌నెవ‌రు ప‌ట్టించుకుంటారు! అనేలా.. చిన్న‌పాటి క్రిటిసిజం వ‌ర‌కూ ఓకే.

స‌మంత న‌టించిన శాకుంత‌లం- యశోద విడుద‌ల‌కు రావాల్సి ఉంది. ఇవి పాన్ ఇండియా విడుదలకు సిద్ధ‌మ‌వుతున్నాయి. `ఫ్యామిలీమ్యాన్` జోడీతో సామ్ ప‌ని చేయ‌నుంది. జంట ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే ఇటీవ‌ల‌ స‌క్సెస్ ని ఆస్వాధిస్తున్నారు. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో స‌మంత‌ను రాజీ అనే తీవ్ర‌వాది పాత్ర‌కు ఎంపిక చేయ‌డం అది బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం అంతా ఒక మిరాకిల్ అనుకుంటే ఇప్పుడు అదే జోడీ సమంత‌తో మ‌రో వెబ్ సిరీస్ కి స‌న్నాహ‌కాలు చేయ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది. ఇటీవ‌ల‌ సామ్ జంట ద‌ర్శ‌కుల‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. సమంత ముంబైలో ప‌ని మొద‌లు పెట్టింది. అక్క‌డ‌ క్రోమ్ స్టూడియో వ‌ద్ద క‌నిపించింది సామ్. ఇటీవ‌లే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 లో స‌మంత సంద‌డిని మ‌ర్చిపోక ముందే ఇలా ఫ్యామిలీమ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యంతో క‌లిసి క‌నిపించింది.

తాజాగా స‌మాచారం మేర‌కు.. రాజ్ అండ్ డీకేతో క‌లిసి త‌దుప‌రి వెబ్ సిరీస్ స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని అర్థ‌మైంది. రాజ్ - DK ప్ర‌స్తుతం `సిటాడెల్ స్పిన్-ఆఫ్‌` చిత్రీక‌ర‌ణ‌పై దృష్టి సారించారు. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ క‌థానాయ‌కుడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరా సినీప్రియులంతా రాజ్ అండ్ డీకేని గొప్ప‌గా అభిమానించి ప్రేమిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ జోడీతో స‌మంత అడుగులు త‌న‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ అప్పీల్ ని తేనున్నాయి. మ‌రోవైపు సమంత ఓ అంత‌ర్జాతీయ స్థాయి సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.