Begin typing your search above and press return to search.

గాడ్స్ టైమింగ్ ఈజ్ ప‌ర్ఫెక్ట్ : సాయిధ‌ర‌మ్‌ తేజ్‌

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:45 PM GMT
గాడ్స్ టైమింగ్ ఈజ్ ప‌ర్ఫెక్ట్ : సాయిధ‌ర‌మ్‌ తేజ్‌
X
మెగా మేన‌ల్లుగా సాయిధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియాలో వేదిక షేర్ చేసిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ `రిప‌బ్లిక్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీని దేవా క‌ట్టా తెర‌కెక్కించారు.

కీల‌క వ్య‌వ‌స్త‌లు స్వ‌తంత్రంగా ప‌నిచేయ‌గ‌లిగిన నాడే అది నిజ‌మైన రిప‌బ్లిక్ అనే రెవ‌ల్యూష‌న‌రీ క‌థ‌తో రూపొందిన ఈ మూవీ మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందించింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు సెప్టెంబ‌ర్ లో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు సాయి ధ‌ర‌మ్ తేజ్.

అప్ప‌టి నుంచి మీడియాకు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. క‌నీసం త‌న ఫేస్ ని కూడా చూపించ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ ప‌బ్లిక్, ఫ్యామిలీ ఫంక్ష‌ల‌తో తిరుగుతున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ క‌న‌క దుర్గ టెంపుల్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఫేస్ క‌నిపించ‌కుండా త‌ల‌పాగా ధ‌రించి ముఖానికి బ్లాక్ మాస్క్ తో క‌నిపించారు. అ త‌రువాత మ‌రెక్క‌డా క‌నిపించ‌లేదు. ఇదిలా వుంటే తాజాగా ఆయ‌న పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

`మీ జీవితంలో అత్యుత్త‌మ‌స్క్రీన్ ప్లే వేవుడు ముందే రాసేశాడు. అయ‌న‌ను విశ్వ‌సించి ముందుకు సాగండి..మీ మార్గంలో వ‌చ్చినదాన్ని తీసుకోండి` అంటూ గాడ్స్ టైమింగ్ ఈజ్ ప‌ర్ఫెక్ట్ అని రాసివున్న ఓ ఫొటోని హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ అభిమానులతో పంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ కి అర్థ‌మేంట‌ని కొంత మంది ఆరా తీస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం `భీమ్లానాయ‌క్‌` గురించి మాట్లాడుతున్నారు. గాడ్స్ టైమింగ్ ఈజ్ ప‌ర్ఫెక్ట్ అంటూ సాయి ధ‌ర‌హ్ తేజ్ చేసిన ట్వీట్ `భీమ్లానాయ‌క్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కి చాలా ద‌గ్గ‌ర‌గా వుంద‌ని, ఎవ‌రెన్ని హ‌ర్డిల్స్ సృష్టించినా దేవుడు రాసిన స్క్రీన్ ప్లే.. ప‌ర్ఫెక్ట్ టైమింగ్ ముందు నిల‌వ‌లేవ‌ని చెప్పిన‌ట్టుగా వుంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్‌` రిలీజ్ విష‌యంలో సందిగ్థ‌త నెల‌కొన‌డం... ఆ త‌రువాత ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కావ‌డం.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ఏపీలో అధికార పార్టీ థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల‌ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సాయి ధ‌ర‌య‌మ్ తేజ్ పెట్టిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే సాయి ధ‌రమ్ తేజ్ `రిప‌బ్లిక్‌` మూవీ త‌రువాత ఓ థ్రిల్ల‌ర్ మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. సుకుమార్ తో పాటు ఈ చిత్రాన్ని బివీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు. కార్తీక్ వ‌ర్మ దండు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.