Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ అంద‌ర్నీ అలా లాక్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:27 AM GMT
బుట్ట‌బొమ్మ అంద‌ర్నీ అలా లాక్ చేస్తుందా?
X
బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే ఫుల్ ఫామ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేమైన గుర్తింపుని ద‌క్కించుకుంటోంది. కోలీవుడ్...టాలీవుడ్..బాలీవుడ్ అంటూ అన్ని భాష‌ల్ని చుట్టేస్తోంది. అన్నింటిని మించి బ్యూటీకి టాలీవుడ్ లో ద‌క్కిన ఐడెంటీటీ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.`అల‌వైకుంఠ‌పుర‌మ‌లో` స‌క్సెస్ త‌ర్వాత `మోస్ట్ ఎలిజ్ బుల్ బ్యాచ్ ల‌ర్` తో స‌క్సెస్ లో అందుకుంది. రెండు ఒక‌దాని వెంట ఒకటి స‌క్సెస్ అందుకున్న చిత్రాలు. దీంతో బ్యూటీ `రాధేశ్య‌మ్` తో హ్యాట్రిక్ పై కన్నేసింది. ప్ర‌భాస్ -పూజాహేగ్డే న‌టించిన ఈ చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

బుట్టబొమ్మకి ఇది తొలిపాన్ ఇండియా చిత్రం. ఇలాంటి చిత్రంలో న‌టించే అవ‌కాశం రావాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ అమ్మ‌డి కెరీర్ ఆరంభంలోనే వ‌చ్చింది. బాలీవుడ్ లో మూడవ చిత్రమే హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న `మొహంజ‌దారా`లో న‌టించే ఛాన్స్ అందుకుంది. కానీ ఆ సినిమా స‌క్స‌స్ కాక‌పోవ‌డం బ్యూటీని టాలీవుడ్ వైపు పూర్తి స్థాయిలో దృష్టి నిలిపేలా చేసింది. అటుపై అందివ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం అత్య‌ధిక‌ పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ల‌లో పూజాహెగ్డే కూడా ఒక‌రు.

ఇదే బ్రాండ్ తో కోలీవుడ్ లోనూ `బీస్ట్` చిత్రానికి భారీగానే ఛార్జ్ చేసింది. ఈ విషంయ‌లో కొంత మంది నిర్మాత‌లు పూజా హెగ్డే పై యుద్ధాన్నే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పూజాకి అంత పారితోషికంతో పాటు ప్ర‌త్యేక సిబ్బందిని..చార్టెడ్ ప్లైట్ వంటి సౌక‌ర్యాలు క‌ల్పించాలా? అని మండిప‌డ్డారు. పూజా బ్యూటీని ఇలా ప్రోత్స‌హిస్తున్న నిర్మాత‌ల‌ది త‌ప్పు అంటూ అస‌హనాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.. మ‌రి ఇప్పుడు పూజాహెగ్డే అలాంటి వాళ్లంద‌ర్ని కూల్ చేసేలా త‌న‌లో డౌన్ టు ఎర్త్ క్వాలిటీని బ‌య‌ట‌పెడుతుందా? ఎంత ఎదిగినా ఒదిగా ఉన్నాను అన్న సంకేతాలు పంపిందా? అంటే అవున‌నే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ల‌తోనే కాదు..స్ర్కిప్ట్ న‌చ్చితే స్టార్ అనే బేధం లేకుండా సినిమాలు చేయాల‌ని బ్యూటీ భావిస్తున్న‌ట్లుతెలుస్తోంది. స్ర్కిప్ట్...అందులో త‌న పాత్ర‌మే లాక్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఎంత బిజీగా ఉన్నా మంచి క‌థ‌ల్ని మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దులుకోకూడ‌ద‌ని బ్యూటీ కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా యువ సామ్ర‌టాట్ నాగ‌చైత‌న్య‌తో రెండ‌వ సినిమా చేయ‌డానికి అంగీక‌రించింద‌ని ప్ర‌చారం సాగుతోంది.న‌టిగా చేతిలో చాలా సినిమాలున్నా చైత‌న్య ప్రాజెక్ట్ ని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌ద‌లుకోకూడ‌ద‌ని లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఒకలైలా కోసం` చిత్రంతోనే ప్రారంభ‌మైంది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంతో తెర‌కెక్కిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అయినా ఆ ప్ర‌భావం పూజా కెరీర్ పై పెద్ద‌గా ప‌డ‌లేదు. బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది. `దువ్వాడ జ‌గ‌న్నాధం`తో తొలి స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. అటుపై `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ` బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో అమ్మ‌డి ఫేట్ మారిపోయింది.

మ‌ళ్లీ దాదాపు ఏడేళ్ల గ్యాప్ అనంత‌రం పూజా హెగ్డే చైత‌న్య స‌ర‌స‌న‌ న‌టిండానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ న‌టించిన `ఆచార్య‌`..`రాధేశ్యామ్` చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రంలోనే ఈ భామ‌నే హీర‌యిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అటు బాలీవుడ్ లో `సిర్క‌స్` లోనూ న‌టిస్తోంది.