Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ ని ఒక్క విష‌యంలో ప‌వ‌న్ ఆట‌ప‌ట్టిస్తున్నార‌ట‌

By:  Tupaki Desk   |   25 March 2022 10:33 AM GMT
త్రివిక్ర‌మ్ ని ఒక్క విష‌యంలో ప‌వ‌న్ ఆట‌ప‌ట్టిస్తున్నార‌ట‌
X
స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ల మ‌ధ్య మంచి స్నేహ బంధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. `జ‌ల్సా` నుంచి మొద‌లైన వీరి ఫ్రెండ్షీప్ ఇప్ప‌టికీ అదే స్థాయిలో కంటిన్యూ అవుతుండ‌టం విశేషం. ప‌వ‌న్ కోసం ఎలాంటి రిస్క్‌ని అయినా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతుంటారు త్రివిక్ర‌మ్‌. ఇటీవ‌ల `భీమ్లానాయ‌క్‌` కోసం తొలి సారి త‌ను డైరెక్ష‌న్ ని ప‌క్క‌న పెట్టి డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించారు.

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. వ‌సూళ్ల ప‌రంగానూ ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ మూవీ రూప‌క‌ల్ప‌ణ విష‌యంలోనూ, ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డంలోనూ త్రివిక్ర‌మ్ ముందుండి అన్నీ తానై న‌డిపించారు. తాను డైరెక్ట్ చేయ‌లేక‌పోయినా ఆ అవ‌కాశాన్ని సాగ‌ర్ కె. చంద్ర‌కు అప్ప‌గించారు. ఈ మూవీ విజ‌యంలో త‌న వంతు పాత్ర‌ని పోషించారు.

అంతే కాకుండా మూడున్న‌రేళ్ల త‌రువాత ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లో బిజీ కావాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో ఆయ‌న‌కు బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్‌` రీమేక్ లో న‌టించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా త్రివిక్ర‌మే అంటారు. అలా ప‌వ‌న్ కెరీర్ ని విజ‌య‌వంతంగా రీ స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌ధాన భూమిక‌ని పోషించిన‌, ఇప్ప‌టికీ పోషిస్తున్న త్రివిక్ర‌మ్ గురించి తాజాగా ప‌వన్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇటీవ‌ల నేతాజీ సుభాస్ చంద్ర‌బోస్ జీవితంపై ర‌చ‌యిత ఎం.వి.ఆర్ శాస్త్రి రాసిన‌ `నేతాజీ` పుస్త‌క స‌మీక్ష హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. త‌న‌ని ఆట ప‌ట్టిస్తుంటాన‌ని చెప్పుకొచ్చారు.

త్రివిక్ర‌మ్ కు త‌న‌కు పుస్త‌కాల విష‌యంలో తేడా వ‌స్తుంటుంద‌ని, నా ద‌గ్గ‌ర ఏదైనా కొత్త పుస్త‌కం వుంటే అది త‌న‌కు న‌చ్చింద‌ని త్రివిక్ర‌మ్ కావాల‌ని అడుగుతుంటాడ‌ని, అయితే అత‌నికి పుస్త‌కం ఇవ్వ‌ను కానీ కావాలంటే సినిమా ఫ్రీగా చేసిపెడ‌తాన‌ని చెబుతుంటాన‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ఇదిలా వుంటే క్రిష్ తెర‌కెక్కిస్తున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లో మ‌రో రీమేక్ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్న విష‌యం తెలిసిందే. త‌మిళ హిట్ ఫిల్మ్ `వినోదాయ సితం` ఆధారంగా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.