Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : రంగ్‌ దే కోసం మళ్లీ ల్యాండ్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   27 Sep 2020 7:10 AM GMT
ఫొటోటాక్‌ : రంగ్‌ దే కోసం మళ్లీ ల్యాండ్‌ అయ్యింది
X
ఆరు నెలల విరామం తర్వాత ఈ నెలలో టాలీవుడ్‌ లో షూటింగ్‌ హడావుడి కనిపిస్తుంది. జూన్‌ నెల నుండి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ చేసుకోవచ్చు అంటూ అనుమతులు వచ్చినా కూడా ఒక మోస్తరు నుండి పెద్ద సినిమా మేకర్స్‌ మాత్రం ఇన్ని రోజులు కరోనా తగ్గుముఖం పడుతుందేమో అంటూ ఎదురు చూశారు. కాని కరోనా తగ్గక పోవడంతో ఇక చేసేది లేక మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. పలువురు యంగ్‌ హీరోలు సినిమా షూటింగ్‌ లను మొదలు పెట్టేశారు. నితిన్‌ హీరోగా రూపొందుతున్న 'రంగ్‌ దే' షూటింగ్‌ హైదరాబాద్‌ లో ప్రారంభం అయ్యింది.

రంగ్‌ దే సినిమా షూటింగ్‌ కోసం చెన్నై నుండి కీర్తి సురేష్ హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యింది. రెండు మూడు వారాల క్రితం ఆమె హైదరాబాద్‌ వచ్చి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు రంగ్‌ దే సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్బంగా ఆమె విమానాశ్రయంలో కనిపించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సింపుల్‌ డ్రస్ లో వైట్‌ మాస్క్‌ తో కర్లీ హెయిర్‌ స్టైల్‌ తో చాలా సింపుల్‌ గా కీర్తి సురేష్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో నడుచుకుంటూ రావడంతో ఫొటోగ్రాఫర్స్‌ తమ కెమెరాకు పని చెప్పారు. కీర్తి సురేష్‌ ఎయిర్‌ పోర్ట్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో నితిన్‌ తో కలిసి ఈమె రంగ్‌ దే బ్యాలన్స్‌ షూటింగ్‌ లో పాల్గొనబోతుంది. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే.