Begin typing your search above and press return to search.

బాలీవుడ్ వెళ్లేందుకు ఈ 'క్షణం' రెడీ

By:  Tupaki Desk   |   1 March 2016 4:23 AM GMT
బాలీవుడ్ వెళ్లేందుకు ఈ క్షణం రెడీ
X
అడివి శేష్ - ఆదాశర్మ - అనసూయలు నటించిన కిడ్నాప్ థ్రిల్లర్ 'క్షణం' కు తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం కోటి రూపాయల ఖర్చుతో తీసిన ఈ మూవీ.. ఇప్పటికే లాభాల్లోకి కూడా వచ్చేసింది. సినిమాకు రేటింగ్ లతో పాటు, మౌత్ టాక్ కూడా అదుర్స్ అనేలా ఉండడంతో.. మూడో రోజు నుంచి థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఇప్పుడు క్షణంకు పలు ఇండస్ట్రీల నుంచి రీమేక్ రైట్స్ కోసం రిక్వెస్టులు ఎక్కువయ్యాయి.

కన్నడ - హిందీ రంగాల నుంచి ఇప్పటికే రీమేక్ కోసం ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అయితే క్షణం మూవీ మేకర్స్ మాత్రం.. బాలీవుడ్ లో సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఈ సబ్జెక్ట్ నార్త్ ఆడియన్స్ కు కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేది కావడంతో.. హిందీ వెర్షన్ ను తామే తీయాలన్నది నిర్మాతల ఆలోచన. టెక్నికల్ టీం విషయంలోనూ ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన రవికాంత్ పెరెపు.. హిందీ వెర్షన్ కి కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించి లీడ్ రోల్ లో నటించిన అడివి శేష్.. హిందీ క్షణం ద్వారా బాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో మంచి స్టాండర్డ్స్ తో రూపొందించడం ద్వారా అక్కడ కూడా సత్తా చాటేందుకు పీవీపీ సంస్థ సిద్ధమవుతోందని సమాచారం.