Begin typing your search above and press return to search.

క్షణం బడ్జెట్ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Feb 2016 5:30 PM GMT
క్షణం బడ్జెట్ ఎంతో తెలుసా?
X
అడవి శేష్ - ఆదాశర్మ - అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్షణం’ పి.వి.పి.సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవికాంత్ అనే ఓ కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వైజాగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ కుర్రాడు... సినిమాల మీద వున్న ప్యాషన్ తో అడవి శేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి... ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఓ రోజు అడవి శేష్... జూబ్లీహిల్స్ నుంచి మణికొండ వైపు కారులో వెళుతుండగా... లిఫ్ట్ అడిగిన ఓ చిన్నారిని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సస్పెన్స్ డ్రామా చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్రం బృందం తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. దర్శకుడు రవికాంత్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని అందరూ ప్రాణం పెట్టి చేశారు. ఈ చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ చిత్రానికి కేవలం రూ.కోటి రూపాయలు మాత్రమే అయింది. ఇంత తక్కువ బడ్జెట్టులో అంత మంచి సినిమా తీయడం నిజంగా చిత్రం యూనిట్లో వున్న కమిట్ మెంట్ ఏమిటో మీకు అర్థం అవుతుంది. తప్పకుండా ఈ సినిమా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తుందని’ తెలిసారు.

హీరో అడవిశేష్ మాట్లాడుతూ ‘సినిమా నిడివి ఎండింగ్ టైటిల్స్ తో కలిపి రెండు గంటలు వుంటుంది. టైటిల్స్ స్క్రోలింగ్ టైమింగ్ తీసేస్తే.. సినిమా మొత్తం గంటా యాభై మూడు నిమిషాలు వుంటుంది. చాలా క్రిస్ప్ గా ఎడిట్ చేశాం. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఇంత క్వాలిటీగా తీయడానికి సహకరించిన పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ ను అభినందించాలి. అనసూయ, ఆదాశర్మ పెర్ ఫార్మెన్స్ అదిరిపోయింది’ అన్నారు.