Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మూడేళ్ల పాప మిస్సింగ్ థ్రిల్లర్

By:  Tupaki Desk   |   3 Feb 2016 11:46 AM GMT
ఫస్ట్ లుక్: మూడేళ్ల పాప మిస్సింగ్ థ్రిల్లర్
X
భారీ చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో ప్రఖ్యాత బ్యానర్ గా కొనసాగుతున్న పీవీపీ.. ఓ స్మాల్ బడ్జెట్ ను కూడా నిర్మిస్తోంది. రవికాంత్ పెరెపై డైరెక్షన్ లో 'క్షణం'అనే చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. అడివి శేష్, ఆదా శర్మ జంటగా తెరకెక్కిన ఈ మూవీలో.. సోగ్గాడి మరదలు అనసూయ కూడా ప్రధాన పోషిస్తోంది.

మూడేళ్ల పసిపాప మిస్సింగ్ కేసును డీల్ చేయడమే కథాంశంగా తీసుకుని, క్షణంను తెరకెక్కించారు. అడవి శేష్ హీరోగా చేస్తుండడంతోపాటు.. తనే స్టోరీ అందించడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో అనసూయ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తోంది. ప్రధాన కేరక్టర్ల మధ్యే తిరిగే ఈ స్టోరీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా థ్రిల్ ని ఇస్తుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో కూడా పాప మిస్సింగ్ నే ప్రధానంగా చూపించారు. అడివిశేష్ చాలా సీరియస్ గా డీల్ చేస్తున్నట్లు ఉండగా.. ఆదాశర్మ నవ్వులు చిందిస్తూ గ్లామర్ ఒలకబోస్తోంది. గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ మాత్రం.. ఫుల్ డ్రస్ తో సీరియస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది.

ఒక్క పోస్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో కానీ, మార్చ్ మొదటి వారంలో కానీ క్షణం ను విడుదల చేసేందుకు.. పీవీపీ సంస్థ సిద్ధమవుతోంది. కంప్లీట్ గా యాక్షన్ మోడ్ లో సాగే ఇలాంటి మూవీ.. టాలీవుడ్ లో వచ్చి చాలాకాలమైందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.