Begin typing your search above and press return to search.

కరోనా బారినపడ్డ స్టార్ హీరోయిన్!?

By:  Tupaki Desk   |   7 Dec 2020 10:20 PM IST
కరోనా బారినపడ్డ స్టార్ హీరోయిన్!?
X
కరోనాకు కాదు ఎవరు అనర్హం అన్నట్టుగానే పరిస్థితి తయారైంది. బయటకు వస్తే చాలు అది పేదవారైనా.. సెలబ్రెటీ అయినా మహమ్మారి అంటుకుంటోంది. ఈ అంటు వ్యాధి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు.

బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో సినీ హీరోలు, హీరోయిన్లు బయటకు వస్తున్నారు. అయితే సినిమా సెట్స్ లలో తగినన్ని జాగ్రత్తలను దర్శక నిర్మాతలు తీసుకోకపోవడంతో నటీనటులు బలి అయిపోతున్నారు.

ఇటీవలే షూటింగ్ లకు హాజరైన హీరో వరుణ్ ధావన్, నీతు కపూర్, దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ కథానాయిక ‘వన్ -నేనొక్కడినే’ తో తెలుగులో మహేష్ పక్కన నటించిన కృతి సనన్ సైతం కరోనా బారినపడింది.

తాజాగా షూటింగ్ కు హాజరైన ఆమె కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. రాజ్ కుమార్ రావ్ సినిమా షూటింగ్ నిమిత్తం చండీఘర్ వెళ్లిన కృతి షెడ్యూల్ పూర్తికావడంతో ఆదివారం ముంబైకి చేరింది.

ముంబైకి వచ్చిన కృతి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. కృతికి ఎక్కడ ఎలా కరోనా సోకిందో తెలియడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆమె షూటింగ్ లో పాల్గొన్న చిత్రం బృందం సభ్యులు ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కృతి ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది.