Begin typing your search above and press return to search.

హైప్ వద్దులే అంటున్న క్రిష్‌ టీమ్

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:34 AM IST
హైప్ వద్దులే అంటున్న క్రిష్‌ టీమ్
X
ఇప్పుడు సంక్రాంతికి జనవరి 12న ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమాను విడుదల చేయాలని డైరక్టర్ క్రిష్‌ అండ్ టీమ్ డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అనవసర హైప్ క్రియేట్ చేయకూడదని క్రిష్‌ ఆదేశాలిచ్చాడట. ఇప్పటికే సినిమా ట్రైలర్ వచ్చాక హైప్ డబుల్ అవ్వగా.. మొన్న ఆడియో లాంచ్ లో శాతకర్ణి గొప్పతనం గురించి తెలుగు చరిత్ర గురించి వక్తలు స్టేజీపై చెప్పాక హైప్ ఇంకా పెరిగింది. అంతే కాకుండా.. సినిమా పాటల వీడియోలు కూడా ఇంప్రెస్ చేసి క్రేజ్ ను పెంచేశాయి. ఇంతకంటే ఏం కావాలి.

నిజానికి గత సంక్రాంతికి ఇలాగే కోన వెంకట్ అండ్ డైరక్టర్ శ్రీవాస్ లు కలసి.. ''డిక్టేటర్'' సినిమాకు భారీ హైప్ తెచ్చేశారు. బాలయ్య కెరియర్లోనే ఇదో తురుపు ముక్క అన్న రేంజులో ప్రచారం చేశారు. తీరా ధియేటర్లలోకి వచ్చాక సినిమా డిజాష్టర్ అయిపోయింది. ఒక ప్రక్కన నాన్నకు ప్రేమతో.. మరో ప్రక్కన సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాలు ఉండటంతో.. డిక్టేటర్ అస్సలు నిలదొక్కుకోలేకపోయింది. సగం ఫెయిల్యూర్ ను ఓవర్ హైప్ కే అంటగట్టారు సినిమా విశ్లేషకులు. అందుకే ఇప్పుడు శాతకర్ణి విషయంలో ఏ మాత్రం ఓవర్ హైప్ చేయకుండా.. ఇప్పటివరకు క్రియేట్ అయిన బజ్ ను ఈ 10 రోజులు అలాగే ఉంచేసి.. సినిమా కంటెంట్ తో షాకివ్వాలనేది క్రిష్‌ ప్లానింగ్.

అయితే రిలీజ్ కు మూడు రోజులు ముందు బాలయ్య అండ్ శ్రీయలు మీడియాకు ఇంటర్యూలు ఇస్తారట. అలాగే క్రిష్‌.. హేమా మాలిని.. కూడా అప్పుడే కొన్ని ఇంటర్యూలు ఇస్తారని తెలుస్తోంది. అప్పటివరకు శాతకర్ణి విషయంలో కాస్త స్లోగానే వ్వవహరిస్తారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/