Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ దర్శకులే.. ఓ సినిమాను నిర్మించనున్నారా..?

By:  Tupaki Desk   |   17 Jun 2020 12:30 AM GMT
పవర్ స్టార్ దర్శకులే.. ఓ సినిమాను నిర్మించనున్నారా..?
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జానపద నేపథ్యంలో 'విరూపాక్ష' అనే చారిత్రక రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాడు క్రిష్. అయితే ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా.. పూర్తయిన తరవాత పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవర్ స్టార్ హీరోగా సినిమాలు డైరెక్ట్ చేస్తున్న ఈ ఇద్దరు దర్శకులు కలిసి.. ఓ సినిమా చేయనున్నారట. అదీ కూడా డైరెక్షన్ కాదు ప్రొడక్షన్.

వీరిద్దరూ ఓ వైపు దర్శకులుగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సీరియళ్లు.. వెబ్ సిరీస్.. సినిమాలు నిర్మిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. ఇక ఇండస్ట్రీలో ఎవరెవరో డైరెక్టర్లు అయిపోతున్నారు.. మరి నేనెందుకు కాకూడదు అనుకున్నాడేమో.. ఇటీవల హరీష్ శంకర్ కూడా నిర్మాతగా మారాడు. ఇప్పటికే నిర్మాత మహేష్ కోనేరుతో కలిసి ఒక సినిమా ప్రకటించాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలపనున్నాడట హరీష్ శంకర్. అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది.. ఎలా ఉండబోతుంది అనే వివరాలతో పాటు హీరోహీరోయిన్లు.. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ సినిమా చేయాలని క్రిష్.. హరీష్ అనుకుంటున్నారట. కానీ నిర్మాతలుగా మారి బాగానే వెనకేసుకోవాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు కలిసి ఓటిటి కోసం ఎలాంటి వెబ్ సిరీస్ లు.. షోలు నిర్మిస్తారో..!