Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా సందిగ్ధంలో యంగ్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   11 Jun 2020 11:30 AM GMT
సూపర్ స్టార్ సినిమా సందిగ్ధంలో యంగ్ హీరోయిన్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో సర్కారు వారి పాట సినిమా రానున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీతో ఓ మాఫియా బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా హోల్డ్‌లో పెట్టి విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో మహేష్ బాబు ఓకే అన్నారు. ఈ విషయాన్ని ముందు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ కూడా కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్‌గా ఓకే అన్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ త్వరలో మొదలయ్యే అవకాశం ఉందట. ఈ సందర్బంగా మహేష్ కోసం హీరోయిన్ వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూస్తున్నారట.

అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అయితే అమ్మడు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేయాలా.. వదులుకోవాలా అనే సందిగ్ధంలో ఉందట. కియారా అద్వానీ ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను ఎలా అని ఆలోచిస్తుందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్‌లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట. కియారా తెలుగులో చివరిగా రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కియారా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2లో నటిస్తోంది. అయితే కియారా నిర్ణయం కోసం డైరెక్టర్ ప్రొడ్యూసర్లు హీరో అందరూ ఎదురు చూస్తున్నారు. కియారాకి కూడా ఈ సినిమా వదులుకోవడం ఇష్టం లేదట. చూడాలి మరి కియారా ఎలాంటి అభిప్రాయం వెల్లడిస్తుందో..!