Begin typing your search above and press return to search.

'వైబ్రేటర్' గురించి గూగుల్ చేసి తెలుసుకున్నా అంటున్న 'లస్ట్' బ్యూటీ...!

By:  Tupaki Desk   |   12 Jun 2020 12:30 PM GMT
వైబ్రేటర్ గురించి గూగుల్ చేసి తెలుసుకున్నా అంటున్న లస్ట్ బ్యూటీ...!
X
కియారా అద్వానీ.. బాలీవుడ్‌ లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.ధోని - ది అన్‌ టోల్డ్ కహాని’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ బాట పట్టిన కియారా అద్వానీ.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫస్ట్ సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం పాలైనా కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత కియారా షాహిద్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌ తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా కియారా 'భరత్ అనే నేను' సినిమా కంటే ముందు 'లస్ట్ స్టోరీస్' అనే ఒరిజినల్ మూవీలో నటించింది. నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అయిన 'లస్ట్ స్టోరీస్‌' విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయింది. దీంట్లో కియారా గృహిణి పాత్రలో కనిపించింది. పెళ్లి తరువాత చాలా కాలం పాటు శృంగారంలో తృప్తి లేక ఇబ్బందులు పడే పాత్రలో నటించి మెప్పించింది. కాకపోతే దీంట్లో కియారా ని చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సిరీస్‌ లో లస్ట్ చూపిస్తూ వైబ్రేటర్‌ వాడే సన్నివేశంలో నటించిన అందరినీ షాక్‌ కి గురి చేసింది. కాగా మరోనటి నేహ దుపియాతో కలిసి పాల్గొన్న చిట్ చాట్ షోలో కియారా ఆ సన్నివేశం కోసం తాను ఎలా ప్రిపేర్ అయ్యిందో వెల్లడించింది. కియారా మాట్లాడుతూ.. ఆ సన్నివేశంలో నటించే ముందు రోజు రాత్రి తాను ఎంతో నెర్వస్‌ అయ్యానని చెప్పింది. మహిళలు వైబ్రేటర్‌ ఎలా వాడతారో గూగుల్ చేసి తెలుసుకున్నానని.. అంతేకాకుండా 'అగ్లీ అండ్ ట్రూత్‌' లాంటి కొన్ని సినిమాల్లో సన్నివేశాలను కూడా చూసి తెలుసుకున్నానని వెల్లడించింది.

కాగా కియారా ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'భూల్ భూలైయా 2' చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా 1999 కార్గిల్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'షెర్షా' సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ - సిధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించనున్నారు. అలానే 'ఇందూ కి జవానీ'.. రాఘవ లారెన్స్ - అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న 'లక్ష్మీ బాంబ్'లో కూడా కియారా నటించింది. ఇక తెలుగులో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా హీరోయిన్ గా ఫైనలైజ్ అయిందని వార్తలు వస్తున్నాయి.