Begin typing your search above and press return to search.

‘ఆచార్య’ కోసం వివిఆర్‌ కాంబో?

By:  Tupaki Desk   |   17 March 2020 3:30 PM GMT
‘ఆచార్య’ కోసం వివిఆర్‌ కాంబో?
X
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో కీలక పాత్రను రామ్‌ చరణ్‌ చేస్తాడని.. ఆ తర్వాత ఆ పాత్రను మహేష్‌ బాబు చేస్తాడంటూ ప్రచారం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఆ పాత్ర గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరకు మళ్లీ ఆ పాత్రను చరణ్‌ చేయబోతున్నట్లుగా అనధికారికంగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది. బడ్జెట్‌ మరియు ఇతరత్ర విషయాల నేపథ్యంలో ఆచార్యలో చరణ్‌ నటిస్తేనే అన్ని విధాలుగా బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట.

ఇక చరణ్‌ కు జోడీగా హీరోయిన్‌ ఎవరు నటించబోతున్నారు అనే చర్చ మొదలైంది. పలువురు హీరోయిన్స్‌ ను పరిశీలించిన తర్వాత ఈ గెస్ట్‌ హీరోయిన్‌ రోల్‌ కోసం కియారా అద్వానీని ఓకే చేసినట్లుగా సమాచారం అందుతోంది. చరణ్‌ మరియు కియారాల మద్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి వినయ విధేయ రామ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడటం.. ఆమె బర్త్‌ డేకు ముంబయికి చరణ్‌ వెళ్లడం తెల్సిందే.

ఇన్ని రోజులు టాలీవుడ్‌ నుండి పలు ఆఫర్లు వచ్చినా కూడా నో చెబుతూ వచ్చిన కియారా అద్వానీ చరణ్‌ నుండి ఆఫర్‌ రాగానే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కియారా అద్వానీ నుండి 30 రోజుల డేట్లను నిర్మాతలు కోరినట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం కోటి వరకు ఆమెకు ముట్టజెప్పుతున్నట్లుగా కూడా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి వివిఆర్‌ ఫ్లాప్‌ అయినా మళ్లీ వారిద్దరి కాంబోను చూడబోతున్నామని మెగా ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.