Begin typing your search above and press return to search.

ఖుషీ లేదని నాగ్ చెప్పేశారులే

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:28 PM GMT
ఖుషీ లేదని నాగ్ చెప్పేశారులే
X
అఖిల్ కొత్త సినిమా ఇప్పటికే మొదలైపోయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై.. నాగార్జున ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే హైద్రాబాద్ మెట్రో రైల్ లో ఓ భారీ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేశారు. త్వరలో ఓ ఫారిన్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారని కూడా అంటున్నారు.

అయితే.. ఇంత జరిగినా అఖిల్ సెకండ్ మూవీలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫలానా హీరోయిన్ ను అనుకుంటున్నారనే న్యూస్ కూడా ఇన్నాళ్లూ ఎక్కడా వినిపించలేదు. అయితే.. రీసెంట్ గా అఖిల్ కి హీరోయిన్ గా టాలీవుడ్ భామలను కాకుండా.. బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే న్యూస్ వచ్చింది. అంతే కాదు.. మాజీ అందాల తార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను తీసుకురానున్నారనే టాక్ కూడా వినిపించేసింది. ఈ రూమర్ పై ఇప్పుడు నాగ్ స్వయంగా స్పందించారు.

ఓ మీడియా రాసిన వార్తకు రియాక్ట్ అయిన నాగార్జున.. దాన్ని రీట్వీట్ చేస్తూ.. అక్కినేని అఖిల్ రెండో సినిమా హీరోయిన్ గా ఖుషీ కపూర్ అన్న వార్తను ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశారు. దీంతో అఖిల్- ఖుషీ కపూర్ కాంబినేషన్ ఒట్టి పుకారే అని తేలిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుండగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ హైలైట్ అవుతుందని అంటున్నారు.