Begin typing your search above and press return to search.

నటి కుష్బూ కుటుంబంలో విషాదం

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:51 AM GMT
నటి కుష్బూ కుటుంబంలో విషాదం
X
మహమ్మారి వైరస్ ప్రముఖ దక్షిణాది నటి కుష్బూ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుష్బూ సమీప బంధువు కరోనా సోకి మృతిచెందడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారని తెలిసింది.

దేశవ్యాప్తంగా మహమ్మారి వైరస్ ప్రబలుతోంది. మహారాష్ట్ర కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోనే 62వేల మందికి పైగా వైరస్ బాధితులున్నారు. ఇప్పటికే 2వేల మంది మరణించారు.

ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న కుష్బూ బంధువుకు ఈ మహమ్మారి వైరస్ సోకింది. తాజాగా అతడికి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మరణించాడు.ఈ విషయాన్ని కుష్బూ ట్విట్టర్ ద్వారా తెలిపి శోకసంద్రమైంది.

అయితే మహమ్మారితో మృతిచెందిన బంధువును కడసారి కూడా చూడలేకపోతున్నామని.. వైరస్ తో మృతి చెందడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కుష్బూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఆమెను ఓదారుస్తూ నెటిజన్లు, అభిమానులు సందేశాలు పంపుతున్నారు.