Begin typing your search above and press return to search.

మహేష్‌ మూవీలో 'కేజీఎఫ్‌' స్టార్‌

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:22 AM GMT
మహేష్‌ మూవీలో కేజీఎఫ్‌ స్టార్‌
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ జరుగుతోంది. అతి త్వరలోనే ఆ సినిమా ను ముగించేందుకు దర్శకుడు పరశురామ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ను ఈనెల చివరి వరకు లేదా వచ్చే నెలకు ముగించేలా ప్లాన్ చేస్తున్నారట. అతి త్వరలోనే తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు గాను మహేష్‌ బాబు రెడీ అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో దర్శకుడు త్రివిక్రమ్‌ బిజీగా ఉన్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ను అక్టోబర్ లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కాని కరోనా పరిస్థితులు ఎటు నుండి ఎటు వైపుకు మరల్చేను అనేది తెలియడం లేదు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అయినా సినిమా మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది అనే నమ్మకంతో మహేష్‌ బాబు అభిమానులు ధీమాగా ఉన్నారు.

ఇక మహేష్‌ బాబుకు జోడీగా ఈ సినిమాలో నటించబోతున్నది ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో సినిమాలో కీలక పాత్రలో నటించేది ఎవరు కూడా చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్‌ బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ ను కీలక పాత్రకు గాను ఎంపిక చేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్ లో కేజీఎఫ్ 2 లో నటించిన సంజయ్‌ దత్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమాలో నటించేందుకు గాను గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. బాలకృష్ణ అఖండ సినిమాలోనే సంజయ్ దత్ ను నటింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో సంజయ్ దత్‌ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన సినిమాను చేయలేక పోయాడు.

కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్ దత్‌ తెలుగు మరియు ఇతర సౌత్‌ భాషల సినిమాల్లో వరుసగా నటించడం ఖాయం అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలోనే సంజయ్ దత్‌ కు మహేష్ బాబు ఫిల్మ్ మేకర్స్ నుండి పిలుపు వచ్చిందని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్‌ చెప్పిన కథ నచ్చడం తో పాటు పవర్ ఫుల్‌ పొలిటికల్‌ పర్సన్ పాత్ర అవ్వడం వల్ల సంజయ్‌ దత్‌ ఓకే చెప్పాడు అనేది సమాచారం. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకొక్కటి సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమాలో సంజయ్ దత్‌ ఉండబోతున్నాడు అనే వార్త అంచనాలు పెంచేస్తుంది. అతడే పార్థు అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ ల కాంబోలో చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.