Begin typing your search above and press return to search.

డార్లింగ్ నెక్స్ట్ మూవీ కేజీఎఫ్ దర్శకుడితోనా...?

By:  Tupaki Desk   |   11 April 2020 4:47 PM GMT
డార్లింగ్ నెక్స్ట్ మూవీ కేజీఎఫ్ దర్శకుడితోనా...?
X
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ' ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ బాగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. గత ఏడాది ప్రభాస్ అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో' తో పలకరించాడు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మాత్రం సాహో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో చేయనున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే లేటెస్టుగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది.

2018లో వచ్చిన 'కేజీఎఫ్' చాప్టర్ - 1 ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 'కేజీఎఫ్' చాప్టర్ 2 అక్టోబర్ లో విడుదల కానుంది. కాగా ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తోగానీ.. మహేశ్ తోగానీ సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకు కమిటై రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇక మహేష్ సైతం ప్రశాంత్ నీల్ కలిసిన మాట వాస్తవమే కానీ సినిమాలకు సంబందించిన ఒప్పందం జరగలేదని స్పష్టత ఇచ్చారు. దాంతో ప్రశాంత్ నీల్.. 'కేజీఎఫ్ 2' తరువాత సినిమాను ప్రభాస్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందట. తమ బ్యానర్లో వాళ్లు ప్రభాస్ సినిమాను సెట్ చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుందని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.