Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తర్వాత కూడా తెలుగులోనే కేజీఎఫ్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   12 Dec 2020 12:12 PM GMT
ప్రభాస్‌ తర్వాత కూడా తెలుగులోనే కేజీఎఫ్‌ డైరెక్టర్‌
X
కేజీఎఫ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆవిషయాన్ని అనధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చింది. ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ అవ్వగానే కేజీఎఫ్‌ స్టార్‌ డైరెక్టర్ తో సినిమా ఉంటుందని నందమూరి అభిమానులు వెయిట్‌ చేశారు. ఈ సమయంలో ప్రభాస్‌ తో సలార్‌ సినిమాను ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించాడు. దాంతో నందమూరి అభిమానులు ఉసూరు మంటున్నారు. వారికి కాస్త ఊరటను కలిగించే విషయం ఏంటీ అంటే సలార్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా ఎన్టీఆర్‌ తో అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వరుసగా పాన్‌ ఇండియా సినిమాలను అది కూడా టాలీవుడ్‌ స్టార్‌ తో చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా 2022లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను ఇంకా పట్టాలెక్కించకుండానే తదుపరి సినిమా విషయంలో కూడా ప్రశాంత్‌ నీల్‌ క్లారిటీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఒక సినిమాను చేయబోతున్నాడట. ఎన్టీఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా మూడు తెలుగు స్టార్‌ హీరోలతో ఈయన సినిమాలను రూపొందించబోతున్నాడు.