Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' మూవీలో కీర్తి పాత్ర ఇదేనట!!

By:  Tupaki Desk   |   8 July 2020 3:31 PM GMT
సర్కారు వారి పాట మూవీలో కీర్తి పాత్ర ఇదేనట!!
X
దక్షిణ సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కీర్తి. అప్పటినుండి తను మిగిలిన హీరోయిన్స్‌తో పోలిస్తే కాస్త ప్రత్యేకం అయింది. ఆ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది కీర్తి. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. మహానటి తర్వాత కీర్తితో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. కీర్తి మాత్రం కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటుంది. మహానటి తర్వాత కీర్తి నుండి సోలోగా పెంగ్విన్ సినిమా విడుదల అయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా తర్వాత కీర్తి చేతిలో మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ.. సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇవేగాక తాజాగా మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటించడానికి కీర్తి ఓకే చెప్పింది. ఈ సినిమా కథ భారీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని.. అందులో మహేష్ బ్యాంకు మేనేజర్ గా కనిపిస్తాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఈ బ్యాంకు మేనేజర్ ఎలాంటి అమ్మాయి ప్రేమలో పడతాడు..? అనేది మరో ఇంటరెస్టింగ్ విషయం. ఈ సినిమాలో కీర్తి.. పాత్ర గురించి సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. మహేష్ బ్యాంకు మేనేజర్ అయితే.. కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనుందట. బ్యాంకు మేనేజర్ - బ్యాంకు ఎంప్లాయి మధ్య లవ్ ట్రాక్ తో పరశురామ్ ఈ సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో బ్యాంకు రంగంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టే ప్రయత్నం చేయనున్నారట. ఇక ఇందులో మహేష్ - కీర్తిల రొమాన్స్ హైలైట్ కానుందని సమాచారం. చూడాలి మరి కీర్తి మహేష్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో..!