Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట'లో మహానటి!

By:  Tupaki Desk   |   17 Jun 2020 7:18 PM GMT
సర్కారు వారి పాటలో మహానటి!
X
సూపర్ స్టార్ మహేష్ కోసం హీరోయిన్ వెతికే పనిలో పడింది సర్కారు వారి పాట చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదివరకే మహేష్ తో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే అమ్మడు ఇన్నిరోజులు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేయాలా.. వదులుకోవాలా అనే సందిగ్ధంలో ఉందట. కియారా అద్వానీ ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను ఎలా అని ఆలోచించి.. మరో రెండేళ్లవరకు తన క్యాలండర్‌లో ఖాళీ లేదని కియారా స్పష్టం చేసిందట. ఇక కియారా తెలుగులో చివరిగా రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కియారా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2లో నటిస్తోంది.

అంతేగాక ఇంతకాలం మహేష్ సరసన సాయిమంజ్రేకర్.. సారా అలీఖాన్ ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. ప్రస్తుతం వీరందరిని పక్కకు జరిపి లైన్ లోకి మహానటి ఫేమ్ కీర్తిసురేష్ వచ్చింది. మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమాలో కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లు డేట్స్ ఇవ్వకపోవడమే కారణం. దీంతో ఇక దక్షిణాది అమ్మాయినే ఖరారు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుని ప్రయత్నాలు చేశారట. ఈ క్రమంలో వీరి ఫస్ట్ ఛాయస్ అయిన కీర్తి సురేశ్ నటించడానికి ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. అదీగాక మహేశ్ కూడా కీర్తికే మొగ్గు చూపడంతో ఆమె ఎంపిక సులువు అయిందని అంటున్నారు. పరశురామ్ అడిగిన డేట్స్ ను ఈ ముద్దుగుమ్మ కేటాయించినట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన త్వరలో రానుందట. దీంతో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.