Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న కీర్తి బ్యాడ్ సెంటిమెంట్..!

By:  Tupaki Desk   |   6 Nov 2020 2:30 AM GMT
మహేష్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న కీర్తి బ్యాడ్ సెంటిమెంట్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. వచ్చే జ‌న‌వ‌రి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీద‌కి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. మహేష్ సరసన జాతీయ ఉత్తమ నటి నటిస్తున్నందుకు ఫ్యాన్స్ సంతోష పడుతున్నప్పటికీ.. కీర్తి బ్యాడ్ సెంటిమెంట్ గురించి ఆలోచించి కలవరపడుతున్నారని తెలుస్తోంది. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం కలబోసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

కీర్తి సురేష్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. పవన్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక తమిళ్ లో విజయ్ సరసన నటించిన 'భైరవ' సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. అలానే విక్రమ్ తో నటించిన 'స్వామి 2'.. సూర్య కు జోడిగా నటించిన 'గ్యాంగ్'.. ధనుష్ సరసన నటించిన 'రైలు' సినిమాలు ప్లాప్ అయ్యాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ 'మరక్కార్ : అరబికదలింటే సింహం' సినిమాలో కీర్తి నటించగా.. ఆ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో మహేష్ తో నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని సూపర్ స్టార్ అభిమానులు కంగారు పడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల కీర్తి నటించిన రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 'మిస్ ఇండియా' మరియు 'పెంగ్విన్' నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఆమె నితిన్ తో కలిసి నటిస్తున్న 'రంగ్ దే' సినిమా హిట్ అయితేనే కీర్తి పై మళ్ళీ హోప్స్ పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి మహానటి ఈ సినిమాలతో హిట్ కొట్టి బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.