Begin typing your search above and press return to search.

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు

By:  Tupaki Desk   |   9 July 2021 2:30 PM GMT
పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు
X
టాలీవుడ్‌ లో వారసులకు కొదవ లేదు. కాని ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నా కొద్ది మంది మాత్రమే సక్సెస్‌ అవుతున్నారు. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో యంగ్ హీరో సింహా ఒకరు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి పెద్దన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే కీరవాణి యొక్క తనయుడు ఈ సింహా అనే విషయం అందరికి తెల్సిందే. జక్కన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ అవ్వడంతో సింహాకు ఈజీగా నే ఎంట్రీ దక్కింది. కాని సక్సెస్ కోసం.. తనకంటూ గుర్తింపును దక్కించుకోవడం కోసం సింహా ప్రయత్నాలు చేస్తున్నాడు.

సింహా హీరోగా మొదటి సినిమా మత్తువదలరా కు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ఆ సినిమాలో సింహా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సింహా రెండవ సినిమా తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ ఆ సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చినా కూడా అనుకున్న స్థాయిలో ఆ సినిమా కూడా ఆడలేదు. దాంతో సింహా మూడవ ప్రయత్నం గట్టిగా చేయాలని ప్రయత్నాలు చేశాడు. పలు కథలు విన్న సింహా ఎట్టకేలకు ఒక మంచి కథను ఎంపిక చేసుకుని సినిమాను కమిట్‌ అయ్యాడు. సింహా మూడవ సినిమాను ప్రముఖ నిర్మాత.. ఇండస్ట్రీలోనే పెద్ద నిర్మాతగా పేరున్న సురేష్‌ బాబు నిర్మించేందుకు సిద్దం అవ్వడం ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు.

సతీష్‌ త్రిపుర అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సురేష్‌ బాబు నిర్మించేందుకు ముందుకు వచ్చారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇప్పటికే ఈ సినిమాకు దొంగలున్నారు జాగ్రత్త అనే టైటిల్ ను ఖరారు చేయడం కూడా జరిగింది. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కు కూడా వెళ్లబోతున్నారు. తమిళ స్టార్‌ నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అవుతుంది.

మొదటి రెండు సినిమాలు నిరాశ పర్చినా కూడా మూడవ సినిమాతో అయినా కీరవాణి తనయుడు సక్సెస్‌ దక్కించుకుని ఇండస్ట్రీలో యంగ్‌ స్టార్‌ ల సరసన నిలుస్తాడా అనేది చూడాలి. హీరోగా మంచి లుక్ తో పాటు అన్ని విషయాల్లో కూడా పాజిటివ్‌ మార్కులు దక్కించుకున్న సింహా మొదటి రెండు సినిమాల ఎంపిక విషయం పక్కన పెడితే మూడవ సినిమా మంచి ఎంపిక అంటూ కొందరు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

సురేష్ బాబు వంటి దిగ్గజ నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్న కారణంగా సినిమాకు మంచి బజ్‌ ఏర్పడటం ఖాయం. ఇక విడుదల సమయంలో జక్కన్న ఫ్యామిలీతో పాటు కీరవాణికి సన్నిహితంగా ఉండే వారు ప్రమోషన్‌ లో తమ సాయంను అందిస్తే సినిమా మరింతగా ఆసక్తి పెంచుతుంది. కనుక సినిమా మినిమంగా ఉన్నా కూడా తప్పకుండా కమర్షియల్‌ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

కీరవాణి ఇద్దరు తనయుల్లో ఒకరు సంగీత దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఆయన పేరు కాళ భైరవ. ఇప్పటికే యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ గా కొనసాగుతున్న కాళ భైరవ మెల్ల మెల్లగా స్టార్‌ హీరోల సినిమాలపై ఫోకస్‌ పెడుతున్నాడు .ఇదే సమయంలో సింహా కూడా హీరోగా సక్సెస్‌ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు కీరవాణి కూడా సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమాకు గాను కీరవాణి సంగీతాన్ని ఇస్తున్న విషయం తెల్సిందే.