Begin typing your search above and press return to search.

ఉడ్తాపంజాబ్ మరింత దూరం చేసిందట

By:  Tupaki Desk   |   20 Jun 2016 3:30 PM GMT
ఉడ్తాపంజాబ్ మరింత దూరం చేసిందట
X
బాలీవుడ్ బ్రేకప్ ప్రేమ పక్షుల్లో రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ లు కూడా ఉన్నారు. తెగ ప్రేమించేసుకుని పెళ్లిపీటలు ఎక్కడమే లేట్ అని అంతా అనుకుంటున్న టైమ్ లో రణబీర్-కేట్ లు విడిపోయారు. ఎలాగైనా వీళ్లిద్దరినీ కలిపేందుకు కొంతమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఘాటు ప్రేమ కావడంతో.. కామన్ ఫ్రెండ్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఈ మధ్యే ఓ పార్టీలో రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ లు కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. చాలాసేపు వీళ్లిద్దరి మంతనాలు సాగడంతో.. ఇక పాత గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే అని అంతా అనుకున్నారు. మళ్లీ ఈ పక్షుల మధ్య ప్రేమ చిగురించిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా ఆవిరైనట్లేనని తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్యా దూరం తగ్గకపోగా మరింతగా పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఉడ్తాపంజాబ్ సినిమా కారణం కావడం విశేషం.

ఆ సినిమాలో వీళ్ల రిఫరెన్సులు ఏం ఉండవ్ కానీ.. ఈ మూవీని కలిసి చూడాలని అనుకున్నారట. రణబీర్ వరకూ ఫ్రెండ్స్ ని వదిలేసి కేట్ తో కలిసి ఉడ్తాపంజాబ్ చూసేందుకు వచ్చాడట. ఏం జరిగిందో తెలీదు కానీ.. కత్రిన మాత్రం షారూక్ - కరణ్ జోహార్ - వరుణ్ ధావన్ - ఆలియా భట్ లతో కలిసి వేరే థియేటర్లో ఈ సినిమాను చూసిందట. ఈ దెబ్బతో వీళ్లిద్దరి మధ్య దూరం మరింతగా పెరిగిందని తెలుస్తోంది.