Begin typing your search above and press return to search.

రూ.100 సాదా చీర‌లో క‌త్రినా హోయ‌లు!

By:  Tupaki Desk   |   31 Oct 2021 12:30 AM GMT
రూ.100 సాదా చీర‌లో క‌త్రినా హోయ‌లు!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇన్ స్టా లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నేటిత‌రానికి ధీటుగా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో క‌త్రిన ముఖ్యంగా సినిమా అప్ డేట్ల‌ను.. విదేశీ విహార యాత్ర‌ల నుంచి ఎక్కువ‌గా ఫోటోలు వీడియోల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తున్నారు. ఇటీవ‌లే `టైగ‌ర్ -3` షూటింగ్ కోసం విదేశాల్ని చుట్టేస్తున్నామ‌ని క‌త్రిన వెల్ల‌డించింది. అక్క‌డ అంద‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను సైతం ఇన్ స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది.

ఆస్ట్రియాలోని సాల్డ్ బ‌ర్గ్ లోని వంతెన‌పై క‌త్రినా నేచుర‌న్ ఆస్వాధిస్తున్న ఫోటో ఒక‌టి వైర‌ల్ గా మారింది. అందాల ఆర‌బోతే కాదు..అద్భుత‌మైన నేచుర్ ని ఆస్వాధించ‌డంలోనూ క‌త్రినా ముందుంటుంద‌ని ప్రూవ్ చేసింది. క‌త్రినా ఇన్ స్టా ఖాతా నుంచి చాలా కాలం త‌ర్వాత అంత అందమైన గ్రీన‌రీ ఫోటో బ‌య‌ట‌కు రావడం ఫాలోవ‌ర్స్ ని బాగా ఆక‌ట్టుకుంది. అంత‌కు ముందు ఇన్ స్టా వేదిక‌గా హాట్ ఫోటోల్ని పోస్ట్ చేసి హాట్ కామెంట్ల‌ను ఫేస్ చేసిన హామ ఈసారి మాత్రం అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంది.

తాజాగా క‌త్రినా వీట‌న్నిటికీ భిన్నంగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టుతో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌కు కాటుక‌...నుదుటిన న‌ల్ల‌టి బొట్టు.. లైట్ మ్యాక‌ప్ తో నేచ‌ర‌ల్ అందాన్ని లివేట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. లైట్ క‌ల‌ర్ సాదా చీర‌కు..మ్యాచింగ్ జాకెట్ తో ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. చ‌క్క‌న‌మ్మ చీర క‌డితే ఆ చీర‌కే వ‌న్నె పెరిగిందా.. అనేంత అందంగా క‌నిపిస్తోంది. ఈ చీర ధ‌ర అందుబాటులోనే ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు స్వీటీ..క్యూటీ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఇక క‌త్రినా ప్రేమాయ‌ణం విష‌యానికి వ‌స్తే.. యువ‌హీరో విక్కీ విశాల్ తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా టూర్లు... పార్టీల పేరుతో ఆ ఇద్ద‌రూ చాలాసార్లు మీడియా కంట ప‌డ్డారు. కానీ అది ప్రేమ కాద‌ని...స్నేహం మాత్ర‌మేని విక్కీ ఖండించే ప్ర‌య‌త్నం చేసాడు. ఇక క‌త్రినా న‌టిస్తోన్న `టైగ‌ర్ -3` విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే చాలా భాగం విదేశాల్లో షూటింగ్ చేసారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌త్రిన‌ను ఇండియ‌న్ సూప‌ర్ ఉమెన్ గా చూపించేందుకు టైగ‌ర్ జిందా హై ద‌ర్శ‌కుడు క‌థ రాస్తున్న సంగ‌తి తెలిసిందే.