Begin typing your search above and press return to search.

మూడేళ్లు యముడితో పోరాటం చేసిందట

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:30 PM GMT
మూడేళ్లు యముడితో పోరాటం చేసిందట
X
తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన కస్తూరి ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్ లో భాగంగా సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె నటిస్తున్న సీరియల్‌ తెలుగులో మంచి రేటింగ్‌ తో దూసుకు పోతుంది. తెలుగు లో ఈమె ఈమద్య వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తుంది.. కామెడీ షో ల్లో పాల్గొంటుంది.. టాక్ షో ల్లో కూడా పాల్గొని తన గురించి.. తన వ్యక్తిగతం కెరీర్‌ తన పిల్లల గురించి చెబుతోంది. ఇటీవల ఈమె ఓంకార్‌ హోస్టింగ్‌ చేస్తున్న సిక్త్స్‌ సెన్స్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఇండస్ట్రీలో తాను ఎదురొన్న ఇబ్బందుల గురించి గతంలో చెప్పుకొచ్చిన కస్తూరి ఈ షో లో మాత్రం తన కూతురు క్యాన్సర్‌ తో పోరాటం చేస్తున్న సమయంలో పడ్డ మానసిక క్షోభను గురించి చెప్పుకొచ్చింది.

షో అంతా కూడా నవ్వుతూ సరదాగా సాగుతున్న సమయంలో కస్తూరి తన కూతురు గురించి చెప్పడంతో చాలా సీరియస్ మూడ్‌ లోకి వెళ్లి పోయింది. మూడు సంవత్సరాల పాటు నా కూతురు క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న సమయంలో నేను కూడా పక్కనే ఉన్నాను. చిన్న బాబును కూడా వదిలేసి మూడు ఏళ్లు నా కూతురు ప్రాణాల కోసం పోరాటం చేశాను. నా కూతురు ప్రాణాల కోసం యముడు ఒక వైపు నేను ఒక వైపు అన్నట్లుగా హోరా హోరీగా పోరాటం చేశాము అన్నట్లుగా కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో డాక్టర్లు ఇచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్ ను తను తట్టుకోలేదేమో అని బాధ వేసింది. అందుకే క్యాన్సర్‌ ను జయించిన నా కూతురు నాకు హీరో అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.

షోలో కస్తూరితో పాటు రాశి పాల్గొన్నారు. కస్తూరి మరియు రాశిలతో ఓంకార్‌ ఆట ఆడేసుకున్నాడు. ఇద్దరిని కన్ఫ్యూజ్ చేస్తూ.. ఇద్దరి మైండ్స్ తో ఆడుకుంటూ వారిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. చివర్లో కస్తూరి కూతురు అక్కడకు వచ్చింది. మొత్తంగా షో మొత్తం ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషనల్‌ గా కూడా చాలా బాగా సాగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కస్తూరి కూతురు గురించి చెప్పిన విషయం ఎంతో మందికి కన్నీరు కూడా తెప్పించి ఉంటాయి అనడంలో సందేహం లేదు. సీనియర్‌ హీరోయిన్స్ తో ఓంకార్ చేసిన ఈ షో ఇటీవలే ప్రముఖ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఛానెల్‌ లో ప్రసారం అయ్యింది.