Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లో వేచిన విడాకులు.. వచ్చేశాయి

By:  Tupaki Desk   |   14 Jun 2016 6:17 AM GMT
ఎన్నాళ్లో వేచిన విడాకులు.. వచ్చేశాయి
X
బాలీవుడ్లో హీరోయిన్లు విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. ఐతే ఈ విషయంలో విపరీతమైన డ్రామా నడిచింది మాత్రం కరిష్మా కపూర్ విషయంలోనే. తన భర్త సంజయ్ కపూర్ నుంచి విడాకుల కోసం ఎప్పుడో రెండేళ్ల కిందట కోర్టును ఆశ్రయించింది కరిష్మా. ఇద్దరి మధ్య కోర్టులో వాదోపవాదాల గురించి చాలా వార్తలొచ్చాయి. గత ఏడాది ఇక విడాకులు మంజూరు కావడమే ఆలస్యం అనుకుంటుండగా.. రాజీ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేసు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐతే ఈ మధ్య ఇరు వర్గాలు చర్చించుకుని మళ్లీ కోర్టుకెక్కాయి. ఎట్టకేలకు ఈ జంటకు విడాకులిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చేసింది.

2003లో వివాహం చేసుకున్న ఈ జంట ఐదారేళ్ల పాటు బాగానే ఉంది. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. సంజయ్ తన మీద దాడి చేశాడంటూ పిల్లల్ని తీసుకుని కొన్నేళ్ల కిందటే పుట్టింటికి వచ్చేసిన కరిష్మా.. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల సంరక్షణ బాధ్యతలు కరిష్మానే చూసుకోబోతంది. నెలకు రెండు వారాంతాల్లో మాత్రం పిల్లలు సంజయ్ కపూర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. హీరోయిన్ గా 90ల్లో కరిష్మా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి పక్కనా నటించింది.