Begin typing your search above and press return to search.

విడాకుల త‌ర్వాత క‌రిష్మా ఎలా అయ్యిందంటే..

By:  Tupaki Desk   |   12 July 2016 2:57 PM GMT
విడాకుల త‌ర్వాత క‌రిష్మా ఎలా అయ్యిందంటే..
X
రెక్క‌లు తొడిగిన ప‌క్ష‌ల్లే ఎగిరిందే నా మ‌న‌సు.. అంటూ దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన ఓ పాట ఉంటుంది. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌.. క‌రిష్మా క‌పూర్ ప్ర‌స్తుతం అలాంటి పాటే పాడుకున్న‌ట్లుంది. ఈ మ‌ధ్యే భ‌ర్త సంజ‌య్ క‌పూర్ నుంచి విడాకులు తీసుకున్న క‌రిష్మా వెంట‌నే తాను స్వేచ్ఛా జీవిని అయిపోయాన‌ని చాటి చెబుతూ యూరప్ టూర్ వేసింది. అక్క‌డ పిచ్చ పిచ్చ‌గా ఎం.జాయ్ చేసి.. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఓ టీనేజీ అమ్మాయిలా ఆమె డ్రెస్సింగ్.. ఆమె ఉత్సాహం చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌డం ఖాయం.

లండన్ నుంచి బుడాపెస్ట్ వరకు ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన ఈ అమ్మడు.. అన్నిచోట్లా ఫొటోలు దిగి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. సినిమాల‌కు గుడ్ బై చెప్పేశాక సంజ‌య్ క‌పూర్ ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు ఇంటిప‌ట్టునే ఉండిపోయిన ఆమె.. ఆ త‌ర్వాత విడాకుల గొడ‌వ‌లో మునిగి తేలింది. గ‌త నెల‌లోనే ఆమెకు విడాకులొచ్చాయి. 2003లో వివాహం చేసుకున్న సంజ‌య్-క‌రిష్మా ఐదారేళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. సంజయ్ తన మీద దాడి చేశాడంటూ పిల్లల్ని తీసుకుని కొన్నేళ్ల కిందటే పుట్టింటికి వచ్చేసిన కరిష్మా.. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ కేసు చివరకు గత నెల‌లో ఓ కొలిక్కి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.