Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణ కోసం క‌న్న‌డ స్టార్

By:  Tupaki Desk   |   3 Jan 2022 5:59 AM GMT
బాల‌కృష్ణ కోసం క‌న్న‌డ స్టార్
X
టాలీవుడ్ లో మాస్ ఆడియ‌న్స్ కి సీమ చిత్రాల‌తో పూన‌కాలు తెప్పించిన ఏకైక హీరో నంద‌మూరి స‌ట‌సింహం బాల‌కృష్ణ‌. గ‌త కొంత కాలంగా మాసీప్ బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం ఎదురు చూసిన ఆయ‌న తాజాగా `అఖండ‌` చిత్రంతో మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ బ్లాస్టింగ్ హిట్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన బాల‌య్య అదే జోష్ తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నారు.

`క్రాక్‌` సినిమాతో గోపీచంద్ మ‌లినేని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప‌క్కా మాస్ మ‌సాలా హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డ‌మే కాకుండా గోపీచంద్ మ‌లినేనికి సాలీడ్ బ్లాక్ బ‌స్టర్ హిట్ ని అందించింది. ఈ మూవీ త‌రువాత గోపీచంద్ మ‌లినేని - బాల‌కృష్ణ‌ల క‌ల‌యిక‌లో మాసీవ్ ఎంట‌ర్‌టైన‌ర్ ని మైత్రీ మూవీ మేకర్స్ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది.

`క్రాక్‌`లో ర‌వితేజ‌కు జోడీగా న‌టించి ర‌ఫ్ఫాడించిన శృతిహాస‌న్ ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తోంది. ఎన్‌బికె 107 గా తెర‌పైకి రానున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది, ఈ నేప‌థ్యంలో ఈ మూవీని కూడా బాల‌య్య అభిమానుల‌కు ఓ విందు భోజ‌నంలా వుండేలా స‌క‌ల హంగుల‌తో తీర్చి దిద్దుతున్నారు. `క్రాక్‌`లో స‌ముద్ర‌ఖ‌నిని ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ క‌ఠారి కృష్ణ పాత్ర‌లో చూపించిన గోపీచంద్ మ‌లినేని తాజా చిత్రంలోనూ అంత‌కు మించిన ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌ని డిజైన్ చేశార‌ట‌. ఈ పాత్ర కోసం క‌న్న‌డ స్టార్ `దునియా` విజ‌య్‌ని ఫైన‌ల్ చేశారు.

గ‌త కొంత కాలంగా తెలుగులో ప‌రిచ‌యం కావాల‌ని ఎదురుచూస్తున్న `దునియా` విజ‌య్ కిది ప‌ర్‌ఫెక్ట్ మూవీ కాబోతోంది. గోపీచంద్ సినిమాల్లో విల‌న్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌న్న‌ది తెలిసిందే. బాల‌య్య‌తో చేస్తున్న సినిమాలో విల‌న్ కి హీరోకి మ‌ధ్య ఎలాంటి రైవ‌ల్రీని చూపించ‌బోతున్నాడ‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాల‌య్య కోసం ఈ మూవీకి ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన గోపీచంద్ మ‌లినేని ఇందులో బాల‌య్య పాత్ర‌ని కూడా మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ గా చూపించ‌బోతున్నాడు.

వేట‌పాలెం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో గోపీచంద్ మ‌లినేని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. అంతే కాకుండా బాల‌య్య 107వ చిత్రం కావ‌డంతో ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ఆర్టిస్ట్ లు , టెక్నిషియ‌న్ ల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ట‌.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్, జాతీయ అవార్డ్ గ్ర‌హీత న‌వీన్ నూలి ఎడిటింగ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా ఏ.ఎస్‌. ప్ర‌కాష్‌, రామ్ - ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్‌, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప‌వ‌ర్ ఫుల్ మాసీవ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల‌లోనే ప్రారంభం కాబోతోంది.